Pages

సంబంద భాందవ్యాలు


మనిషి ఎల్లప్పుడూ ఒంటరిగా కాకుండా ఒక సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు. తన కుటుంబంతో జీవనం సాగించడానికి ఒక ఇంటిని కట్టి దానినే దేవాలయం  గా భావిస్తారు.
" ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం "

అంటూ ప్రతీ వారి లాగానే మనం కూడా, మా ఇల్లు కూడా ఎల్లప్పుడూ  సంతోషంగా ఉండాలని అనుకుంటాం.

కానీ నేడు మన బృందావనం  బీటలు వాలి చివరికి మమకారం తగ్గి అహంకారంతో రగిలి అతలాకుతలం అయ్యింది.
ఆలోచిస్తే ఒకే ఇంట్లో పెరిగినవాళ్ళం, ఒకే బడిలో చదివినవాళ్ళం, ఒకే ఊళ్ళో తిరిగినవాళ్ళం .... కానీ మన వయస్సు పెరుగుతున్న కొద్దీ పెద్దల ఆలోచనలో చాలా  మార్పులు వచ్చాయి.
దీనికి కారణం మారుతున్న కాలంతో పాటు, రోజురోజుకి  మనిషిలో పెరుగుతున్న స్వార్ధం. ఎందుకంటే మన చిన్నతనంలో
"కలసి ఉంటే కలదు సుఖం" అని చెప్పేవారు,
కానీ నేడు " కలసి కలహించుకోవడం కన్నా విడిపోయి సంతోషంగా ఉండటం మేలు". అంటున్నారు.
ఇది భౌతిక , కుటుంబ ఎడబాటు అయితే అంత ఇబ్బందేమీలేదు. కాని
చిన్నతనంలో ఉన్న కుటుంబాలని నేటి కుటుంబాలతో పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.
"వెన్నలాంటి  రాత్రులలో చందమామ మిస్ అవ్వలేదు కానీ చందమామ కధలు చెప్పేవారు మిస్ అయ్యారు.
ఎండా కాలంలో వేసవి సెలవులు మిస్ అవ్వలేదు కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదినీ ఒక దగ్గర చేర్చే పెద్ద దిక్కు మిస్ అయ్యారు.
ప్రతి సంవత్సరం  వచ్ఛే పండగలు మిస్ అవ్వలేదు కానీ ఏ పండగ నాడు
ఏ తీపి వంటకం వండాలో చెప్పే మనిషి మాత్రం మిస్ అయ్యారు".
దీనికి కారణం నేటి తరానికి కధలు చెప్పడానికి ట్యాబ్లు, యూ  ట్యూబ్లు ఉన్నాయి. అదే వేసవి సెలవులు వస్తే సమ్మర్ కోర్సులు, క్రాష్ కోర్సులు ఉన్నాయి. అలాగే పండగలు వస్తే తినడానికి రెస్టారెంట్స్, తిరగడానికి షాపింగ్ మాల్స్ ఉన్నాయి.
అందుకే నేటి తరానికి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు అవసరం లేదు. అందుకే మన భారత దేశంలో కూడా ఉమ్మడి కుటుంబాలు శాతం తగ్గుముఖం  పడుతుండగా చిన్న కుటుంబాల శాతం పెరుగుతూ ఉంది.
నేటి తరానికి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళని ఒక క్రాష్ కోర్సులో జాయిన్ చేస్తారు.ఇలా చివరికి వ్యక్తిత్వ వికాసం కూడా కోర్సుల్లో జాయిన్ అయి నేర్చుకుందుకు ప్రయత్నిస్తారు..
వాళ్ళు వృత్తిలో రాణించడానికి పాఠాలు చెప్పగలరేమో గాని జీవితానికి కావాల్సిన నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు మాత్రం నేర్పించలేరని తెలియడం లేదు.
ఒక అర్ధ శాస్త్రవేత్త చెప్పిన
మాటను గుర్తుచేస్తాను
" All human relations are commercial relations"
అంటే
" మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే".
ఏమో కొన్ని సార్లు ఈ మాట నిజమనిపిస్తుంది. నేటి సమాజంలో మనిషి బంధాలను ప్రేమతో కాక డబ్బుతో ముడి వేస్తున్నారు. ఎక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందో ఆ బంధాలు దృఢంగా ఉంటాయి.
ప్రేమ, అభిమానాలు వ్యక్త పరచడానికి ఇచ్చిపుచ్చుకోవడమనేది ఒక పద్ధతి. అంతే కానీ పుచ్చుకొనే ధోరణితో బంధాలు ఏర్పడితే అవి ఎక్కువ కాలం నిలబడవు.
ప్రేమకు ప్రాధాన్యత ఉన్నచోట డబ్బు ఉంటుంది.కానీ డబ్బుకి ప్రాధాన్యత ఉన్నచోట మాత్రం ప్రేమ నిలబడదు.
కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం.
" ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ,మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం "
ఈ మాటలు నిజం . ఎందుకంటే.......
"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".  

అందుకే మన జీవితంలో
ఉన్న ప్రతీ బంధాన్ని  నిలబెట్టుకోవాలి. ఎందుకంటే "
When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relationship more than 'EGO'.
Let's have a smooth relationships. 🙏🙏


ఏప్రిల్ 2009లో జరిగిన సంఘటన. నేను ఢిల్లీ నుంచి విమానంలో తిరిగి వస్తున్నాను. నా పక్కనే రామకృష్ణ మఠానికి చెందిన ఒక స్వామీజీ కూర్చుని ఉన్నారు. అటుపక్కన అమెరికాకు చెందిన ఒక విలేకరి ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం స్వామి పక్కన ఉన్న విలేకరి ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. విలేకరి:  “స్వామీజీ ఇంతకుముందు మీరు ఇచ్చిన ఉపన్యాసంలో బంధాలు అనుబంధాల గురించి వివరించారు. నాకు సరిగా అర్థం కాలేదు మళ్ళీ వివరించగలరా?” దానికి స్వామీజీ నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తూ విలేకరిని తిరిగి ఇలా ప్రశ్నించారు “మీరు న్యూయార్క్ నుంచి వస్తున్నారా?” విలేకరి: “అవును.” స్వామీజీ : “మీ ఇంటిలో ఎవరుంటారు?” ఈ ప్రశ్న పూర్తిగా వ్యక్తిగతము మరియు అసంబద్ధం కావడంతో విలేకరి స్వామీజీ తన ప్రశ్నను దాటవేస్తున్నారు అనుకున్నారు. అయినప్పటికీ విలేకరి చెప్పసాగాడు “అమ్మ చనిపోయారు. నాన్న అక్కడే ఉంటున్నారు. ఇంకా నాకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అందరికీ వివాహం అయింది.” ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా స్వామీజీ గారు మళ్లీ ఇలా అడిగారు “నీవు మీ నాన్నగారితో మాట్లాడుతున్నావా?” విలేకరి ముఖకవళికలు మారటం మొదలైంది. స్వామీజీ: “ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు?” జేవురించిన ముఖంతో విలేకరి ఇలా చెప్పాడు “సుమారు ఒక నెల అయి ఉండొచ్చు.”. స్వామి గారి ప్రశ్నల పరంపర కొనసాగింది. “మీ అన్న చెల్లెళ్ళ ను ఎంత తరచుగా కలుసుకుంటారు? ఆఖరిసారిగా కుటుంబమంతా ఎప్పుడు కలిసి ఉన్నారు?” ఆ సమయంలో విలేకరి నుదుట నుంచి చెమట  కారణం స్పష్టంగా కనిపించింది. అక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. స్వామీజీ నా? లేక విలేకరా? నాకైతే స్వామీజీ విలేకరిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అనిపించింది. ఒక నిట్టూర్పు తో విలేకరి చెప్పాడు “సుమారు రెండు సంవత్సరాల క్రితం … క్రిస్మస్ సందర్భంలో మేమందరము కలిశాము.” స్వామీజీ : “మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు?” నుదుటన స్వేదబిందువులు తుడుచుకుంటూ విలేకరి అన్నాడు “మూడురోజులు.” స్వామీజీ : “ఎంతకాలం మీ నాన్నగారితో గడిపావు? ఆయన పక్కనే ఎంతకాలం కూర్చున్నావు?” ముఖం కందగడ్డలా మారిన విలేకరి కాగితంపై పిచ్చిగీతలు గీయడం మొదలుపెట్టాడు. స్వామీజీ : “నీవు ఎప్పుడైనా మీ నాన్నగారితో కలిసి భోజనంచేసావా? ఆయన ఎలా ఉన్నారని ఎప్పుడైనా అడిగావా? మీ తల్లి చనిపోయిన తర్వాత ఆయన రోజులు ఎలా గడుపుతున్నారో అడిగావా?” విలేకరి కంటినుంచి కన్నీరు కారటం స్పష్టంగా కనిపించింది. అప్పుడు స్వామీజీ విలేకరి చేతిని ప్రేమతో అందుకని ఇలా అన్నారు “బాధపడకు. నిన్ను తెలియకుండా బాధించి ఉంటే క్షమించు. కానీ నీవడిగిన బంధం అనుబంధాలకు సమాధానం ఇదే. మీ నాన్నగారితో నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు. అనుబంధం అంటే హృదయానికి హృదయం కలిసిపోవడం. కలిసి ఉండడం. కలిసి భోజనం చేయడం. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం; స్పర్శించటం.. చేతులు కలపడం… కళ్ళలోకి సూటిగా చూడగలగటం… కలిసి సమయాన్ని గడపడం. మీ సోదరులందరితో కూడా నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు.” ఆ విలేకరి కన్నీళ్ళు తుడుచుకుంటూ స్వామీజీతో అన్నారు “బంధం అనుబంధాల గురించి ఇంత అద్భుతమైన బోధన చేసినందుకు ధన్యవాదాలు.”

ఇదీ నేటి వాస్తవికత. సమాజంలో గానీ, ఇంటిలోగానీ అందరికీ బోలెడు బంధాలు ఉన్నాయి. కానీ అనుబంధాలు కనుమరుగయ్యాయి. ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా, ఎవరి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు. మనం కూడా బంధాలకు కాకుండా అనుబంధాలకు ప్రాముఖ్యతను ఇద్దాం. పరస్పర ఆప్యాయతలతో కలిసి మెలిసి ఉందాం,

 ఒక ఆంగ్ల సందేశానికి తెలుగు అనువాదం 🙏🙏🙏
సౌ జ న్య  o - whatup message