Pages

ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవారు


*మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందా అందంట ఒక మహాతల్లి. (బొగ్గుల కుంపటి కొనుక్కోవచ్చని ఆశగా)*

దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రు నిర్ణయం తీసుకున్నారు.  అగ్ర కులాల ఆధిపత్యం అధికమైన కాంగ్రెస్ లోని కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక హరిజనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు.   సంజీవయ్య అవినీతిపరుడు అని, లక్షలాది రూపాయలు సంపాదించారని నెహ్రు కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి.  సంజీవయ్య నీతి, నిజాయితీ కూలంకుషం గా ఎరిగిన నెహ్రు వారి ఫిర్యాదులను కొట్టి పారేశారు.  అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.  సరే, విచారిస్తాలే అని హామీ ఇచ్చారు నెహ్రు.  కొంతకాలం పాటు ఆ నిర్ణయం వాయిదా పడ్డది.


   అప్పుడు నెహ్రు తన ఆంతరంగిక మిత్రుడు అయిన ఓ నాయకుడిని ఆంద్ర వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు, నేటి ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ అయిన చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు.  సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు.  అయినప్పటికీ, ప్రధాని ఆదేశం కావడం తో వెళ్లాల్సిందే అన్నారు ఆయన.  


  ఇద్దరూ కలిసి సంజీవయ్య గారి గ్రామం వెళ్లారు కారులో.  గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి.  ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యి పై మట్టి కుండతో అన్నం వండుతున్నది.  పొగ గొట్టం తో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది.  "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు నాయకుడు.  "సంజీవయ్య గారి ఇల్లు ఇదే.  ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు.  కారు దిగండిఅన్నారు చక్రపాణి.  నాయకుడు నివ్వెరపోయాడు.  

  చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న  మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారుఅన్నారు.   

  ఆమె చెమటలు తుడుచుకుంటూ  "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా బాబు? ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది.  ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు"  అన్నది.  

  నాయకుడి నోట్లోంచి మాట రాలేదు.  "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?"  అడిగారు చక్రపాణి.  "అవసరం లేదు.  కారును హైద్రాబాద్ కు పోనీయండి"  అన్నాడు నాయకుడు.  


  ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తోలి హరిజన ముఖ్యమంత్రి అయ్యారు....

సౌ జ న్య  o - whatup message

మానవవాదులకు ఐక్యూ ఎక్కువ!

మతరహిత ప్రజలు దేశాల వారీగా ఈ విధంగా ఉన్నారు.
ఎస్తోనియా - 76.5 శాతం;
జపాన్ - 76 శాతం;
డెన్మార్క్ - 72 శాతం;
స్వీడన్ - 64 శాతం;
వియత్నాం - 62.5 శాతం;
మకావ్ - 60.9 శాతం;
జెక్ రిపబ్లిక్ - 57.5 శాతం;
హాంకాంగ్ - 57 శాతం;
ఫ్రాన్స్ - 53.5 శాతం;
నార్వే - 51.5 శాతం;
చైనా - 47 శాతం;
నెదర్లాండ్ - 47 శాతం;
ఫిన్లాండ్ - 44 శాతం;
ఇంగ్లాండు - 41.5 శాతం;
దక్షిణ కొరియా - 41 శాతం;
జర్మని - 40శాతం;
హంగరి - 39 శాతం;
బెల్జియం - 38.75 శాతం;
బల్గేరియా - 37 శాతం;
సోవేునియా - 36.15 శాతం;
న్యూజిల్యాండ్ - 34.7 శాతం;
రష్యా - 30.5


శాతం; అవెురికా - 20 శాతం. ఇంతకూ మన భారతదేశంలో మతరహిత జనాభా 0.6 శాతం.

ఈ వివరాలన్నీ ఎందుకంటే ప్రపంచదేశాలలో మనవెుక్కడున్నావున్నది బేరీజు వేసుకోవడానికి! దేవుడు - దయ్యాల భావనల్లోంచి, సంప్రదాయం, ఆచారాల పేరుతో మూఢనమ్మకాల కొనసాగింపులోంచి బయటపడి, ఇకైనెనా ఆధునిక వైజ్ఞానిక సమాజానికి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి!!

6 నవంబర్ 2015న ‘ద గార్డియన్’ ఇంగ్లీషు పత్రిక ఈ విధంగా ప్రకటించింది ‘మతరహిత సంస్కృతి, ప్రజా స్వామిక వాతావరణం ఉన్న కొన్ని దేశాల్లో నేరాల శాతం తగ్గి, కొన్ని జైళ్ళు కూడా మూసేస్తున్నారు. అంతేకాదు, ప్రపంచ దేశాల్లో జరిపిన ఒక సర్వే - మతాన్ని ఆచరించే కుటుంబాల పిల్లలతో పోల్చినపుడు... మతరహిత కుటుంబాల పిల్లలు దయగల వారుగా, నైతికంగా పద్ధతి గలవారుగా ఉన్నారని వెల్లడించింది.
ఈ కాలంలో తెలివితేటల్ని ఐక్యూ లెవెల్స్‌తో కొలుస్తు న్నాం. ఇవి దేవుణ్ణి నమ్మే వారిలో, నమ్మని వారిలో ఎలా


ఉన్నాయి అనే పరిశీలన జరిగింది. నాస్తికుల ఐక్యూ లెవెల్స్ 115-125 మధ్య ఉంది. ఇంకొందరిలో 125 కంటే ఎక్కువగా కూడా ఉంది. అదే ఆస్తికుల విషయానికొస్తే అది 85-115 మ ధ్య ఉంది. మరికొందరిలో ఇంకా  తక్కువగా 75 మాత్రమే ఉంది. మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని సరాసరి లెక్కగడితే, 90 శాతం మంది జనం ఐక్యూ 85-115 మధ్య ఉంది. ఆపైన ఉన్నవారు 5 శాతైమెతే, 85కు తక్కువ మరో 5 శాతం ఉన్నారు. దీనివల్ల కూడా ఒక విషయం తేటతెల్లమౌతోంది. దైవభ్రాంతి, దైవచింతన, దైవభక్తి లేదా దేవుడంటే భయపడే జనాభా ప్రపం చంలో అధికంగా ఉంది. మనిషి సృష్టిం చుకున్న అతి భయంకరైమెన భావన ఏమిటంటే అది - దేవుడే. అందులోంచి బయటపడాల్సింది మనిషే.

దేవుడు లేడు, లేడు, లేడు - అని ఘంటాపథంగా చెప్పిన పెరియార్ ఒక మాట చెప్పాడు. ‘నీ బుద్ధి పని చేయ డం ప్రారంభిస్తే అక్కడ భక్తి నిలవదు. నీ బుద్ధి బద్ధకిస్తే, అక్కడ నీ మీద భక్తి పెత్తనం చేస్తుందీ అని!’ ఒకసారి ఒకతను పెరియార్‌తో వాదులాటకు దిగాడు. ‘దేవుణ్ణి రాయిగా తేల్చేయకండి! అదిప్పుడు రాయి కాదు, మంత్రోచ్ఛారణతో దాన్ని దేవుణ్ణి చేశాం’ - అని అన్నాడు. ‘రాయినే దేవుణ్ణి చేయగల శక్తి గలవారు కదా? అట్టడుగు వర్ణాల వారిని మంత్రోచ్ఛారణతో అగ్రవర్ణాల వారిగా చేయండి! మనుషులంతా సమానులై సమస్యలు లేకుండా పోతాయి కదా?’ - అని ప్రశ్నించాడు పెరియార్! ఆనాటి ఆయన ప్రశ్నకి ఈనాటికీ జవాబు లేదు.

హిందూ మతం గూర్చి ప్రపంచానికి మహోపన్యాసం ఇచ్చిన వివేకానందుడే ఆ తర్వాతి కాలంలో ఏమన్నాడో పరిశీలించండి. ‘ఏ హేతు పరిశీలనల వల్ల కనుగొనబడ్డ విషయాలు ప్రతి విజ్ఞాన శాస్త్రాన్ని రుజువు చెయ్యడానికి కారణభూతాలవుతున్నాయో, వాటి సహాయంతో మతమూ నిరూపించబడాలా? అంటే అవుననే నా అభిప్రాయం! ఈ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఒకవేళ అలాంటి పరశోధనల వల్ల మతం నశించే పక్షంలో - ఇంతకాలంగా అది నిష్ప్రయోజనైమెందని, అనుచితైమెన అంధవిశ్వాసమని తెలుస్తూ ఉంది. కాబట్టి, అదెంత త్వరగా నశిస్తే అంత మంచిది. అది పోవటం కంటే మేలైన పని మరొకటి ఉండబోదని నా నిశ్చితాభిప్రాయం!

పనికిమాలిందంతా పోతుందనడం నిస్సందేహం-’
ఒకప్పుడు దైవ భావనకు మహిమలు ఆపాదించినట్టే, ఇప్పుడు వ్యాపార సినిమా హీరోలకి సాహసా లు ఆపాదించి జనం ఆనందిస్తున్నా రు. ఊహలు, అబద్ధాలు జనాన్ని ఎ క్కువగా ఆకర్షిస్తాయి. నిజాలు, వాస్తవాలు కటువుగానే ఉంటాయి. మన కు తెలుసు, వాస్తవానికి నటీనటులు సాహసవంతులు కారు. సామాన్యులు చేయగలిగే పనులు కూడా వారు చేయలేరు.

ఉదాహరణకు వందల కిలోల బరువు మోయగలిగే హమాలీలున్నారు. మండుటెండలో 20 కి.మీ. రిక్షా తొక్కే వాళ్ళున్నారు. ఐదారు కి.మీ. మంచినీళ్ళ బిందెలు మోసే గృహిణులున్నారు. నటన కాదు, తప్పని సరై వాళ్ళలా చేస్తున్నారు. ఇవన్నీ మన కమర్షియల్ సినీ హీరో, హీరోయిన్‌లు చేయగలరా? చేయలేరు - అలా ఒళ్ళు హూనం చేసుకుని బతికే వాళ్ళు కాసేపు వెండితెరమీద ఊహలు, భ్రమలు, అబద్ధాలు చూసి ఆనందిస్తారు. ఇదేవిధంగా తాము చేయలేని పనులు తాము కల్పించుకున్న భగవంతుడు అవలీలగా చేస్తాడని జనం నమ్మారు. ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఆ భావన నిలవడానికి అనాదిగా అన్ని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కథల్లో, నవలల్లో కల్పిత పాత్రలు పాఠకుల్ని ఏదో ఊహా ప్రపంచంలోకి తీసుకుపోతాయి కదా? ఈ దైవ భావన అంతే అని అర్థం చేసుకోవాలి!

ఎంత చదివారు? ఎంత ఎదిగారు? ఎన్ని కోట్లు కూడబెట్టారు? ఎన్ని మేడలు కట్టుకున్నారు? ఎంతటి ఖరీైదెన కార్లలో తిరిగారూ - ఇవి ముఖ్యం కాదు. కాస్త వివేకంతో కూడిన ఎదుగుదల, కాస్త విజ్ఞానంతో కూడిన ప్రవర్తన కావాలి. విచారించాల్సిన విషయవేుమంటే ఎలక్ట్రానిక్ మీడియా బాగా పెరిగాక అర్థం, పర్థంలేని మూఢత్వం బాగా పెరుగుతోంది. బాబాలు, స్వామీజీలు, అమ్మలు గంటల తరబడి టీవీల ద్వారా ఇంటిం టా అవివేకాన్ని, మూఢత్వాన్ని వెదజల్లుతున్నారు. అందుకే శాస్త్రీయైమెన చదువు కావాలంటున్నాం. నిరూపణకు నిలబడనివి ‘నమ్మకం’ స్థాయిలో ఉంటే భరించొచ్చు. కానీ అవి ‘అమ్మకం’ స్థాయికొచ్చేస్తున్నాయి. కాబట్టి సామాన్య జనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. శాంతి పూజలు  చేయిస్తానని, పరమాన్నంలో మత్తమందు కలిపి, 1.33 కోట్ల నగదు కాజేసిన ఒక బాబా ఉదంతం హైదరాబాద్, బంజారాహిల్స్‌లో వెలుగులోకి వచ్చింది కదా?

మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఒకైవెపున ఉంటే, ఇంగిత జ్ఞానం ఉపయోగించని ధనిక మూర్ఖ శిఖామణులు ఏ స్థాయిలో ఉన్నారనేది - మరొకైవెపున ఉంది కదా?
ఏ మతమూ శాంతికి స్వర్గధామం కాదు. హింసను ప్రోత్సహించే మౌలికాంశాలు ప్రతి మతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా గతాన్ని తవ్వి చెప్పుకోనవసరం లేదు. ఇంతెందు కూ? ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న హింసలో ఎక్కువ శాతం మతం నేపథ్యంలో జరుగుతున్నదే కదా?

అందువల్ల ఏ మతమూ నిర్దుష్టం కాదు. అన్నింటిలో లోపాలున్నాయి. ఇది మెరుగైంది. ఇది స్వచ్ఛైమెంది అని ఏ మతానికీ మొదటి స్థానం ఇవ్వలేం. మనిషి కేంద్రంగా అతను సాధించిన విజయాలు కేంద్రకంగా చేసుకుని, మానవ వాదాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో తప్పకుండా మనం చాదస్తాల్ని, మూఢనమ్మకాల్ని వదిలేయగలం. మతరహిత సమాజాన్ని ఏదో ఓ నాటికి రూపొందించుకోగలం!

వ్యాసకర్త: డా. దేవరాజు మహారాజు

సౌ జ న్య  o - whatup message

సైన్స్ సర్వం ఎరుగదు, మతానికి అసలేమీ తెలియదు!


సైన్సు ఒక్కటే సైన్సును సమర్థిస్తుంది. అవసరమైతే విభేదిస్తుంది. తప్పిదం జరిగితే ఒప్పుకుంటుంది. సరిదిద్దుకుంటుంది. ఈ చర్య నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మతానికి అసౌ కర్యం లేదా సౌలభ్యం లే దు. అది ఎదుటివారిని చంపి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. గతమైనా, వర్తమానమైనా మనకీ విషయం స్పష్టం చేస్తుంది. సత్యం తనని నమ్మమని ఎవరినీ ప్రాధేయపడదు, ప్రార్థించదు. ఆ అవసరం మతాలకుంది. సైన్సుకు లేదు. ఉదాహరణకు శాస్త్ర వేత్తలంతా శని, ఆదివారాల్లో ఒకచోట సమావేశమై ఎప్పు డూ పాటలు పాడలేదు. వాళ్ళకు ఆ అవసరమే లేదు. సత్యం-దానికదే ఆవిష్కరింపబడుతుంది. దానికదే నిలబడు తుంది.

మత విశ్వాసాలున్నవారికి అసత్యాల్ని, భ్రమల్ని, కల్పనల్ని నమ్మే ప్రయత్నంలో సెల్ఫ్ మెస్మరిజం, సెల్ఫ్ మో టివేషన్ అవసరం! అందువల్ల ప్రార్థనలు, కీర్తనలు, ధ్యా నాలు, పూజలు, సమాధిలోకి పోవడాలు, శ్వాసమీద ధ్యాస పెట్టడాలు వగైరా అవసరమౌతాయి. ఇవి లక్షల సంవత్సరాలుగా, మిలియన్ల మంది ఆచరిస్తున్నా.. అసత్యం- సత్యం గా మారలేదు. భ్రమ-వాస్తవం కాలేదు. లేని దేవుడు ఎక్క డా ఎవరికీ కనిపించలేదు. ఆగామి కాలాలలో కూడా ఇది ఇలాగే ఉంటుంది. అసత్యాన్ని సత్యంగా మార్చడం ఏ మతం వల్లా కాలేదు- కాదు’, సత్యాన్ని ఎప్పుడూ దివిటీలా ఎత్తిపట్టేదే సైన్సు గనుక,అసత్యాలు దానికి సుదూరంలోనే ఉంటాయి.

   సైన్సు గురించి చెప్పుకోవాల్సిన మంచి విషయ మేమంటే ఎవరూ నమ్మినా నమ్మకపోయినా దాని అస్తిత్వం దానికి ఉంటుంది. అది కూడా వాస్తవంలో, సత్యంలో ఒక భాగంగా ఉంటుంది. మతం పరిస్థితి దీనికి భిన్నం. జనం నమ్మితేనే దాని అస్తిత్వం ఉంటుంది. జనం నమ్మకపోతే అది ఉండదు. అందువల్ల ఎక్కువమందిని తన పరిధిలోకి లాక్కో వడానికి అది నిరంతరం ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. వీలయితే ఆశ చూపిస్తుంది. వీలు కాకపోతే, పీకనొక్కేస్తుంది. వైజ్ఞానిక చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా అలాంటి సంఘట నలు లేవు.

మనుషుల్ని విడదీయకుండా అందరికీ మేలు చేసేది సైన్సు. మేలు జరుగుతుందని మాయమాటలు చెపు తూ జనాన్ని విడగొట్టేది మతం. సైన్సుకు సరిహద్దులే లేవు. కొత్త ఆలోచనలతో నిరంతరం తనని తాను మార్చుకుంటూ, ప్రపంచాన్ని మార్చుకుంటూ పురోగమనంలోకి దూసుకెళ్లేది సైన్సు. మతం మారదు. మారనివ్వదు. దానిదెప్పుడూ తిరో గమనమే పురోగమనమనుకునే పరిస్థితిః జ్ఞానం పేరుతో విస్తరించినమూఢత్వంసమాజానికి ప్రమాద హేతువ యింది తప్ప-నిరక్షరాస్యత, అమాయకత్వం, అజా ్ఞనం సమాజాన్ని ఎప్పుడూ దెబ్బతీయలేదు. అందుకే సమా జంలోని నిరక్షరాస్యత, అమాయకత్వం, అజ్ఞానం తగ్గించ డానికి, మూఢత్వాన్ని ఛేదించడానికి వైజ్ఞానిక స్పృహ అవసర మౌతుంది! అవసరమౌతూనే ఉంటుంది.

ఇది ఇలా ఉంచితే శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో పనిచేసే వారంతా హేతువాదులు కారు. ఉద్యోగాన్ని ఉద్యో గంగా చేస్తూ, వ్యక్తిగతమైన తమ మూఢనమ్మకాల్ని నమ్మ కంగా కాపాడుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఉండడమే కాదు, సామాన్యుల్ని కూడా అయోమయంలో పడదోస్తున్నారు. అన్నీ తెలిసిన వైజ్ఞానికులకే ఇలాంటి బలహీనతలుంటే మన కెందుకు ఉండకూడదూ? అని కొందరు సామాన్యులు భావి స్తూ ఉంటారు. నిజానికి, శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక రంగా లకు సంబంధంలేని ఎంతోమంది సామాన్యులు కూడా తమ ఇంగిత జ్ఞానాన్ని నిద్రలేపి, హేతువాదులవుతున్నారు. టూకీ గా చెప్పేదేమంటే చదువకు, డిగ్రీలకు, హోదాలకు, పదవులకు వైజ్ఞానిక స్పృహకు సంబంధం ఉండాలని మనం అను కుంటూ ఉంటాం. కానీ, నిజానికి ఉండడం లేదు - గొప్ప చదువులు చదివినవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా, మూఢనమ్మకాల మురికిలో మునిగితేలేవారున్నారు. అందుకు భిన్నంగా చదువు, హోదాలేని అతి సామాన్య జీవు లు కూడా వైజ్ఞానిక స్పృహతో హేతువాదులుగా మారిన వారు, మారుతున్నవారు ఉన్నారు. పెద్ద చదువు-హోదా ఉన్నవారందరూ సామాన్యులకు ఆదర్శప్రాయంగా ఉండలేక పోవడం విచారకరం. చదువు హోదా లేక పోయినా సమా జగతిని ఆరోగ్యవంతమైన హేతువాదం వైపు మళ్ళించే సామాన్యులు కూడా కొందరుండడం ఆనందించదగ్గ అంశం.

ఇక్కడ శాస్త్రవేత్తల్లో మత విశ్వాసాలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిద్దాం. కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రక టించిన వివరాల్ని విశ్లేషించుకుందాం. దేవుణ్ణి నమ్మే భారత శాస్త్రవేత్తలు 27 శాతం అయతే యునైటెడ్ కింగ్‌డమ్‌లో 11 శాతం మాత్రమే. ఏదో ఒక శక్తి ఉంది అని నమ్మే భారత శాస్త్రజ్ఞులు 38 శాతమైతే యు.కె.లో 8 శాతమే. భారతీయ వైజ్ఞానికుల్లో 83 శాతం సెక్యులరిజంపై నమ్మకమున్నవారు. అదే యు.కె.లో మత సామరస్యం ఉన్నవారు 93 శాతం.

ఎలెన్ హవార్డ్ ఎక్లాండ్ ఆఫ్ రైస్ యూనివర్సిటీ వారు భారత దేశానికి బ్రిటన్‌కు పోలిక చూపెట్టారు. మత విశ్వా సాలు లేని శాస్త్రవేత్తలు ఇండియాలో 6 శాతమైతే, యు.కె.లో 65శాతం మంది ఉన్నారు. మత సంబంధమైన కార్యక్రమా లకు హాజరయ్యే శాస్త్రజ్ఞులు ఇండియాలో 32 శాతం ఉంటే యు.కె.లో 12 శాతమే ఉన్నారు. మత సంబంధమైన కార్య క్రమాలకు అసలు వెళ్లకుండా ఉండే భారత శాస్త్రజ్ఞులు 19 శాతమైతే యు.కె.లో 68 శాతం మంది ఉన్నారు. ప్రతి మ తంలోనూ కొన్నికొన్ని మౌలికమైన అంశాలున్నాయని నమ్మేవారు భారత్‌లో 73 శాతమైతే యు.కె.లో 45 శాతం మంది. విచిత్రమైన పరిస్థితి ఏమంటే మతానికీ, సైన్సుకు వైరుధ్యాలున్న సంగతి భారతీయ శాస్త్రవేత్తల్లో చాలామంది ఆలోచించనే ఆలోచించరు. మత విశ్వాసాలు లేకపోయినా తమను నాస్తికులుగా ముద్రవేయవద్దన్న శాస్త్రజ్ఞులు ఓ 16 శాతం మందున్నారు. సమాజంలో తమ విలువ తగ్గిపోతుం దేమోనని వారికి భయం! ప్రపంచ పరిజ్ఞానం, మత విశ్వా సాలు భారతీయ శాస్త్రవేత్తలలో ఎలా ఉన్నాయోనని ట్రినిటి కాలేజీలోని ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ సెక్యులరిజమ్ ఇన్ సొసైటీ అండ్ కల్చర్ 2007లో నూటాముప్ఫై భారతీయ పరిశోధనా సంస్థల్లో పనిచేసే పదకొండు వందల శాస్త్రవేత్తల అభిప్రాయాలటా ఒక సర్వే నిర్వహించింది. ఇవన్నీ దాని ప్రకారం వచ్చిన ఫలితాలే. వందలయేళ్ళు బ్రిటీష్ పాలనలో మగ్గిపోయిన మనం, స్వాతంత్య్రం సంపాదించుకుని 70 ద శాబ్దాలవుతున్నా, ఇంకా మనకు సరిపడే విధానాలు రూపొం దించుకోక, బ్రిటిష్ పద్ధతులే అనుసరిస్తున్నాం. కానీ, విచి త్రం.. దైవభావం వదిలేయడంలో మనమూ, మన శాస్త్ర వేత్తలూ ఇంకా ఎంతో వెనకబడే ఉన్నాం.

మతం లేని వైజ్ఞానిక శాస్త్రం కుంటిదేమోగానీ, వైజ్ఞా నికత లేని మతం మాత్రం పూర్తిగా గుడ్డిదిఅని అన్నారు అల్బర్ట్ ఐన్‌స్టెయిన్. ఆయన మరో విషయం కూడా చెప్పా రు.మనకు అంతుపట్టని అనంతాలు రెండున్నా- ఒకటి విశ్వరహస్యం, రెండు మనిషి మూర్ఖత్వం. అయితే మొదటిది విశ్వరహస్యం గురించి నాకింకా కొన్ని అనుమా నా లున్నాయి!అని.. అంటే అనంతమైన మనిషి మూర్ఖత్వం గూర్చి ఐన్‌స్టెయిన్‌కు సందేహమే లేదన్నమాట! అందుకే ఎవరో అన్నారు- "Science does not know every thing. Religion does not know any thing అని.


Beautiful lines from MahaKavi Sri Sri

కుదిరితే పరిగెత్తు.. ,

లేకపోతే నడువు...

అదీ చేతకాకపోతే...

పాకుతూ పో.... ,

అంతేకానీ ఒకే చోట అలా

కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,

వ్యాపారం దెబ్బతినిందని,

'స్నేహితుడొకడు మోసం

చేశాడని,'

ప్రేమించినవాళ్ళు వదిలి

వెళ్ళి పోయారని...

అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,

దాహానికి పనికిరాని

ఆ సముద్రపు కెరటాలే

ఎగిసి ఎగిసి పడుతుంటే...    

తలుచుకుంటే...

నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు

కూడా...

నీ ముందు తలదించుకునేలా

చేయగల సత్తా నీది,

అలాంటిది ఇప్పుడొచ్చిన

ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే

ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది

ఏదీ ఆగిపోకూడదు...,

పారే నది..,

వీచే గాలి...,

ఊగే చెట్టు...,

ఉదయించే సూర్యుడు....

అనుకున్నది సాధించాలని

నీలో కసికసిగా ప్రవహిస్తుందే

ఆ నెత్తురుతో సహా....,,

ఏదీ ఏది ఆగిపోడానికి

వీల్లేదు..,

లే...

బయలుదేరు...

నిన్ను కదలనివ్వకుండా చేసిన

ఆ మానసిక భాదల

సంకెళ్ళను తెంచేసుకో... ,

పడ్డ చోటు నుండే పరుగు

మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...

నిన్ను చీదరించుకోకముందే

బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....

నిన్ను ప్రశ్నించకముందే

సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను

వదిలేయకముందే వెలుగులోకి

వచ్చేయ్..,

మళ్ళీ చెప్తున్నా...

కన్నీళ్ళు కారిస్తే కాదు...,

చెమట చుక్కని చిందిస్తేనే

చరిత్రను రాయగలవని

తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు

మాత్రమే,

ఆచరిస్తే...

అస్త్రాలు.

-SriSri

సౌ జ న్య  o - whatup message

The happy hormones

*The happy hormones*

As I sat in the park after my morning walk, Suman came and slumped next to me. She had completed her 30-minute jog. We chatted for a while.

She said she is not happy in life. I looked up at her sheer disbelief since she seemed to have the best of everything in life.
"Suman, Why do you think so?"

"I don't know. Everyone tells I have everything needed, but I am not happy."

Then I questioned myself, am I happy?

"No," was my inner voice reply. Now, that was an eye-opener for me. I began my quest to understand the real cause of my unhappiness, I couldn't find one. I dug deeper, read articles, spoke to life coaches but nothing made sense.

At last my doctor friend gave me the answer which put all my questions and doubts to rest. I implemented those and will say I am a lot happier person.

She said there are four hormones which determine a human's happiness - Endorphins, Dopamine, Serotonin, and Oxytocin. It is important we understand these hormones, as we need all four of them to stay happy.

Let's look at the first hormone the *Endorphins*. When we exercise, the body releases Endorphins. This hormone helps the body cope with the pain of exercising.We then enjoy exercising because these Endorphins will make us happy.Laughter is another good way of generating Endorphins. We need to spend 30 minutes exercising every day, read or watch funny stuff to get our day's dose of Endorphins.
The second hormone is *Dopamine.* In our journey of life, we accomplish many little and big tasks, it releases various levels of Dopamine. When we get appreciated for our work at the office or at home, we feel accomplished and good, that is because it releases Dopamine. This also explains why most housewives are unhappy since they rarely get acknowledged or appreciated for their work. Once, we join work, we buy a car, a house, the latest gadgets, a new house so forth. In each instance, it releases Dopamine and we become happy. Now, do we realize why we become happy when we shop?

The third hormone *Serotonin* is released when we act in a way that benefits others. When we transcend ourselves and give back to others or to nature or to the society, it releases Serotonin. Even, providing useful information on the internet like writing information blogs, answering people's questions on Quora or Facebook groups will generate Serotonin. That is because we will use our precious time to help other people via our answers or articles.

The final hormone is *Oxytocin*, is released when we become close to other human beings. When we hug our friends or family Oxytocin is released. The "Jadoo Ki Jhappi" from Munnabhai does really work. Similarly, when we shake hands or put our arms around someone's shoulders, various amounts of Oxytocin is released. Now, we can understand why we need to hug a child who has a bad mood.
So, it is simple, we have to exercise every day to get Endorphins, we have to accomplish little goals and get Dopamine, we need to be nice to others to get  Serotonin and finally hug our kids, friends, and families to get Oxytocin and we will be happy. When we are happy, we can deal with our challenges and problems better.