Pages

భగత్‌ సింగ్‌.. దేశభక్తికి ప్రతిరూపం


ఆ... యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగులేశాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. ఆయనే భగత్‌సింగ్‌. ఆయన జయంతి సెప్టెంబర్‌ 28.

భగత్‌ సింగ్‌.. దేశభక్తికి ప్రతిరూపం
భగత్‌ సింగ్‌...ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌ ...ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి.  భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు. 1907 సెప్టెంబర్‌ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్‌ జిల్లా బంగాలో... ఆ విప్లవ వీరుడికి కిషన్‌ సింగ్‌, విద్యావతి దంపతులు జన్మనిచ్చారు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ  విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు.

యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు  సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది.

12
ఏళ్ల వయసులో బ్రిటీష్ పాలకులపై కసి ఉరకలేస్తున్న  యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్‌ వాలాబాగ్‌ దారుణాలను చూసి భగత్‌సింగ్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్‌ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్‌ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు. 1928లో సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం 1928లో సైమన్‌ కమీషన్‌ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో... లాలాలజపతిరాయ్‌ చనిపోవటం తో భగత్‌సింగ్‌ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్‌ వేశారు. విజిటర్స్‌ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు. 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీత బ్రిటీష్‌ హై కమిషనర్‌ సాండర్స్‌ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్‌సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్‌సింగ్‌ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్‌సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్ధాన్‌ పోలీస్‌ శాఖ లాహోర్‌ న్యాయస్ధానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్‌ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా... తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు. భగత్‌సింగ్‌ను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్ పాలకులు చరిత్ర  వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్‌సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి. త్యాగం, ఆదర్శానికి ఆయన నిదర్శనం. అదే నేటి వెలుగు దారి.

శాస్త్ర వివేచన

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఫలితాల్ని అనుభవిస్తూనే సనాతన ఆచారాలు పాటించడం రివాజు. సంస్కృతి పేరిట నిరర్థక క్రతువులు, పూజలు నిర్వహించడం పరిపాటి. తమ నమ్మకాలకు ఆధారం లేదని తెలిసినప్పటికీ వాటిని పట్టుకు వేలాడటం సర్వత్రా కనిపించే దృశ్యం. కార్యాకారణ సంబంధం లేని చర్య ఏదీ ఉండదు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అనేక కోర్సులు చేసేవారికి ఇది స్పష్టంగా తెలిసిన అంశం. అయినప్పటికీ హేతువును అనుసరించే దృష్టికోణం కనిపించదు. కాలం చెల్లిన నమ్మకాల్ని పట్టుకు వేలాడే ధోరణి సమసిపోలేదు. తుమ్మితే బయటికి అడుగుపెట్టరాదని, కాస్సేపు కూర్చొని బయలు దేరేవారిని చూస్తుంటాం. దాని వల్ల సమాజానికేం నష్టం లేదనేవారున్నారు. కానీ అది అక్కడితోనే ఆగిపోదు. పూజలు, నోములు ఇంటికి పరిమితమై ఉండటం లేదు. వీధికెక్కుతున్నాయి. విగ్రహాల్ని ప్రతిష్టించి వాడవాడలా ఉత్సవాల్ని నిర్వహించడంలోని ఔచిత్యం ప్రశ్నార్థకం. మూఢత్వం వ్యక్తిగత ఆచరణగానే మిగిలిపోదు, అది సామాజిక దురాచారంగా పరిణమించి ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తుంది. కులాలు, మతాలు బలపడటానికి దారితీసి శాస్త్రీయ దృష్టికోణం బలహీనమవుతుంది. ఇది అంతిమంగా సమాజంలో అసమానతలు పెరగడానికి దారితీస్తుంది.

శాస్త్రీయ విజ్ఞానఫలాలు అనుభవిస్తారు. సాంకేతికరంగంలోని ప్రతి మార్పును అంది పుచ్చుకుంటారు. మన పనులు తేలికయ్యే వస్తుసామాగ్రి నంతా వశం చేసుకుంటాం. వేల మైళ్ళదూరంలో ఉన్నవారితో తలచిన క్షణమే మాట్లాడే సదుపాయాలతో పులకరిస్తాం. ఆధునాతన సాంకేతిక ప్రజ్ఞకు విస్తుపోతాం. ప్రకృతిని జయిస్తూ మనిషి మేధ విస్తరించే వైనానికి ముగ్ధులమవుతాం. కానీ శతాబ్దాల మూఢత్వాన్ని వదిలించుకోడానికి తటపటాయిస్తారు. విమానాలు ఎక్కుతాం. సముద్రాల మీద క్రూయిజ్‌ల్లో ప్రయాణిస్తాం. కంప్యూటర్లు, మొబైల్స్‌, లాప్‌టాప్స్‌ ఉపయోగిస్తాం. వాటిలోని సరికొత్త ఫీచర్స్‌ని అనుసరిస్తూ అప్‌డేట్‌ కావాలని తాపత్రయపడతాం. సాంకేతిక వైజ్ఞానిక ప్రగతి ఫలాల్ని అందిపుచ్చుకోడంలో ఎక్కడా వెనుకపడరు. కానీ అమెరికా వెళ్ళి కూడా నిమజ్జనాలు చేస్తారు. లక్ష వత్తుల పూజలు చేస్తారు. నిర్హేతుకమైన సామూహక క్రతువుల్ని నిర్వహిస్తారు. ఇదే ఎంత అసంబద్ధం. ఎంతటి వివేక రాహిత్యం. పై చదువులు చదువుతారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తారు. లక్షలు, కోట్లు సంపాదిస్తారు. కానీ శతాబ్దాల మూఢత్వాన్ని తల మీంచి దించుకోరు. శాస్త్రీయ దృష్టికోణంతో జీవితాన్ని వెలిగించుకోరు. ఇది దేశంలోని అత్యధికుల్లో కనిపించే అవలక్షణం. మన జీవితాలకీ, నమ్మకాలకీ మధ్యన అంతరం అతి పెద్దది. ఈ కారణంగానే మన దేశంలో శాస్త్ర పరిశోధనలు నామమాత్రం. సైన్స్‌ పరంగా ప్రపంచానికి మన కంట్రిబ్యూషన్‌ చాలా స్వల్పం. గత రెండు వందల సంవత్సరాల్లో సైన్స్‌ ఫలాల్ని అనుభవించడమే తప్ప సైన్స్‌ విస్తృతికి మనం అందిస్తున్న తోడ్పాటు పూజ్యం. ఎవరో కనిపెట్టిన, సాధించి పెట్టిన వాటికి వినియోగదార్లుగా మిగిలాం, అంతే తప్ప మనంగా వైజ్ఞానిక శాస్త్రానికి అందించింది శూన్యం. మూఢత్వాన్ని వదిలించుకునే సంకల్పం కొరవడటమే ఈ దుస్థితికి మూలం. శాస్త్రీయ వివేచన అలవరుచుకోనంత కాలం మన నమ్మకాలకు మనం బందీలం.

ఎవరు మహాత్ముడు?

ఎవరిని చూసినా ఏమున్నది గర్వకారణం మనం చెప్పుకుంటున్న #మహాత్ములు_జాతిపితలు_దేశభక్తులు అందరూ స్వయం ప్రకటితులే..!
"కులవ్యవస్థను నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న వారినందరినీ నేను వ్యతిరేకిస్తున్నాను". అని ప్రవచించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ "మహాత్ముడు"గా, " జాతిపిత"గా, గొప్ప "దేశభక్తుడు"గా కీర్తించబడుతున్నాడు.
"చాకళ్ళకు, మంగళ్ళకు, తెలికలకు (నూనెలు తీసే వృత్తి), చెప్పులుకుట్టే వారికి, వీధులు ఊడ్చేవారికి రాజీయాలు, శాసనసభ్యత్వాలు ఎందుకో నాకు అర్థం కావడంలేదు". అంటూ... బహిరంగ సభలో ఉపన్యసించిన వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా, గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకుడిగా కీర్తించబడుతున్నాడు.

అస్పృశ్యతా నిర్మూలన ముసాయిదాపై సంతకం పెట్టడానికి నిర్మొహమాటంగా తిరస్కరించి, సాంఘిక సంస్కరణ సభా మంటపాలను పేల్చివేస్తామని ప్రకటించిన బాలగంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకునిగా కీర్తించబడుతున్నాడు.

అస్పృశ్యత బానిసత్వం కంటే నీచమైనది కాదు* అంటూ అస్పృశ్యతను సమర్థించిన లాలా లజపతి రాయ్ గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకునిగా మన్ననలు అందుకుంటున్నాడు.

డిస్కవరీ ఆఫ్ ఇండియా రచించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తన రచనల్లో కులం గురించి కానీ, అస్పృశ్యత గురించి కానీ ప్రస్తావించించకుండానే ఇండియాను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన నవభారత రాజ్యాంగ నిర్మాతగా, గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకునిగా జేజేలు అందుకుంటున్నాడు.
మొదటి నుండి చివరి వరకు సాంఘిక సంస్కరణలను గుడ్డిగా వ్యతిరేకించిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు డబ్ల్యు. సి.బెనర్జీ, దాదాభాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, అనిబిసెంట్ లాంటి వారు గొప్ప దేశభక్తులుగా, జాతీయ నాయకులుగా హారతులు అందుకుంటున్నారు.

హిందూ మత సంస్కృతిని భారతీయ సంస్కృతిగా* ప్రచారం చేస్తూ హిందూ మతాన్ని పరిరక్షించడానికి పూనుకున్న నరేంద్రనాథ్ దత్తు స్వామి వివేకానందగా భారతదేశానికి ఒక రోల్ మాడల్ గా, గొప్ప దేశభక్తుడిగా, జాతీయ నాయకునిగా కీర్తించబడుతున్నాడు.

దాదాపు నలబై సంవత్సరాలుగా ఆంగ్లేయులకు నమ్మిన బంటుగా సేవలందించి, రాజ్యసంక్రమణకు ఆంగ్లేయులు అనుమతించలేదని బ్రతిమిలాడి, భంగపడి, కయ్యానికి కాలు దువ్వి యుద్ధంలో ఓటమిపాలై పారిపోతూ చంపడిన ఝాన్సీ లక్ష్మీబాయి గొప్ప దేశభక్తురాలిగా, ఆత్మగౌరవం కలిగిన వీరనారిగా, అదర్శనీయురాలిగా కీర్తించబడుతున్నది.

అలాగే... నలబై సంవత్సరాలుగా ఆంగ్లేయులకు లొంగిపోయి సామంతులుగా రాజభరణం పొందుతూ ఆ భరణం నిలిపివేయడంతో బ్రతిమిలాడి, భంగపడి, గత్యంతరం లేక కయ్యానికి దిగున నానాసాహెబ్ గొప్ప దేశభక్తుడిగా, ఆదర్శ పురుషునిగా  చెప్పుకుంటున్నారు.

ఆంగ్లేయులు విదేశీ పాలకులు అని తెలిసి కూడా వారికి సేవకుడిగా సైనిక సేవలు అందించడానికి అంగీకరించి, మతపరమైన ఆధిక్యతలకు అనుమతించబడలేదని, ఆవు కివ్వుతో తూటాలను తయారు చేస్తున్నారని, హిందూ మతానికి ముప్పు తలపెడుతున్నారని ఉద్యోగ నిబంధనలను అతిక్రమించి ఆంగ్లేయులపై మతపరమైన యుద్ధం చేయాలని నినదించిన మంగళ్ పాండే గొప్ప దేశభక్తుడిగా, ఆత్మగౌరవం పెంచిన వీరునిగా కీర్తించబడుతున్నాడు.

ఇలా హిందూమతాన్ని, కులవ్యవస్థను కీర్తించిన, పొగిడిన, ప్రచారం చేసిన ప్రతి వ్యక్తిని గొప్ప దేశభక్తుడుగా, గొప్ప వ్యక్తిగా, చారిత్రిక పురుషులుగా, ఆదర్శ మూర్తులుగా, దేశ నాయకులుగా శ్లాఘిస్తున్నారు. అయితే... నిజంగా *భారతదేశ పేరు ప్రతిష్ఠల కొరకు, అభివృద్ధి కొరకు నిజాయితీగా, నిస్వార్థంగా కృషిచేసిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ గారిని* మాత్రం కేవలం ఒక దళిత నాయకునిగా మాత్రమే పేర్కొంటున్నారు. ఇదీ మన న్యాయ విచక్షణ స్థాయి. ఇది ఒక ఉద్దేశ పూర్వకమైన వివక్ష.

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ గారి ఆలోచనా విధానాన్ని, సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారానే ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేయవచ్చు. నిజమైన దేశభక్తులు, నిజమైన ప్రజా ప్రయోజకులు ఎవరు..? అనేది ప్రజలు అర్థం చేసుకోగలరు.
#జై_భీమ్..! ✊🏼 #జై_భారత్..!!

డాక్టర్ యు. వి. రమణ
M.A Ph.D
జిల్లా కార్యదర్శి
బహుజన సమాజ్ పార్టీ
విశాఖపట్నం

నేనుకూడా, గాంధీయే "మహాత్ముడ"ని చదువుకున్నాను.దండి మార్చ్, సత్యాగ్రహ దీక్ష, ఆయన కట్టూ,అలవాట్లూ,విదేశాల్లో సైతం ఆ మొండితనం నిలబెట్టుకుని వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం.. ఇవన్నీ మన క్లాసు పుస్తకాలతో పాటూ మా నాన్నగారు రిచర్డ్ అటెంబరో సినిమా "గాంధీ" చూపించి, ఆయనెంత గొప్పదీక్షాపరుడో చెప్పడం వల్లా, మామూలుగా వచ్చేసాయ్.

" స్త్రీలు అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్టు" అన్న వాక్యమే కంఠతా పట్టాను గానీ "ఒక సమాజం ప్రగతి, ఆ సమాజంలోని స్త్రీలు సాధించిన ప్రగతిపై ఆధారపడి ఉంటుంది"అన్న అంబేద్కర్ మాటలు నేను నా రీసర్చ్ లోకొచ్చాకే తెలుసుకున్నాను.ఈ మాటలు నాకెవ్వరూ చెప్పలేదు,యే టీచర్ దగ్గరా వినలేదు..అంటే మేధావితనాన్ని సైతం తొక్కేసేంతగా  వివక్ష సమాజంలో పాతుకుపోయిందన్నమాట.

అంటే, కేవలం కొంతమందిని మాత్రమే ఇక్కడ పనిగట్టుకుని నేతల్ని చేసారన్న విషయం చాలా చక్కగా అర్ధమౌతుంది. హిందూదేశంగా ఈ దేశాన్ని చెలామణీ చేసే కుట్రలో భాగంగా, పనిగట్టుకుని కొంతమందిని మహాత్ముల్ని చేసారు. అంబేద్కర్ ని, యెంత మేధావైనా కూడా,ఈ దేశంలో కేవలం దళితులకే కాకుండా, సఫాయీ కార్మికులకు, స్త్రీలకు ఇలా దోపిడీ కాబడుతున్న అన్నివర్గాల వారి అభ్యున్నతికీ రేయింబవళ్ళు కృషి చేసినది కేవలం అంబేద్కర్ అన్నది నిజమైనా కూడా, ఆయన గురించి  "రాజ్యాంగ నిర్మాత" అన్న అన్నవిషయం తప్ప ఇంకేం చెప్పరిక్కడ.

నిజమైన స్వాతంత్య్రం స్త్రీలు అర్ధరాత్రి సంచరించి నప్పుడే అన్న మహాత్ముడు,వాళ్ళలా సంచరించగలగడానికి యేంచేసాడో తెల్సుకోవాలనుంది.స్త్రీ జాతికి ఆర్ధిక స్వేచ్చనిచ్చే హిందూ కోడ్ బిల్లును నిరవధికంగా వ్యతిరేకించి, నెహ్రూ పై ఒత్తిడితెచ్చి,ఆ బిల్లును పాస్ కాకుండా చేసిన ఘనత, ఈ పురుషాధిక్యత యెప్పటికీ "ఇలానే" ఉండాలని కోరుకున్న కొంతమంది "మహాత్ములదే".హిందూత్వాన్నీ, దానితోపాటే వచ్చిన అసమానతల్నీ నిర్మూలన చెయ్యలనే ఉదేశ్యం గాంధీ కి లేనేలేదు మరి భారతీయ సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేసిన మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించిన అంబేద్కర్ దాన్ని తగలబెట్టడానికి వెనుకాడలేదు. స్త్రీలనుబానిసలకన్నా హీనంగా చూడాలని, లేదంటే వాళ్ళు అనర్ధాల్ని తెచ్చిపెడతారనీ, అన్నో తమ్ముడో కూడా ఒక స్త్రీతో ఒంటరిగా ఉంటే, ఆమె కుటిల బుద్ధితో వాళ్ళను వశపరుచుకోంటుందనీ" మనువు రాసిన అహంకారపు రాతల్ని అంబేద్కర్ తీవ్రంగా దుయ్యబట్టి, హిండూ కోడ్ బిల్లు రూపకల్పనచేసి, (స్త్రీలకు సమాన ఆస్తి హక్కు, హింసాపూరితమైన వివాహంలో విడాకులు కోరే హక్కు, ప్రసవానికి ముందూ, అనంతరం విశ్రాంతికోరే హక్కూ, నిర్ణీత పనివేళలు,పురుషులతో పాటూ సమాన వేతనాలూ), అది పాస్ చేయించటానికి ఎంతో పోరాటం చేసారు.

 ఐతే, స్త్రీకి స్వేచ్చ వస్తే, ఆమెను, ఆమె లైంగిక, ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని గుప్పెట్లో పెట్టుకుని సమాజన్ని నడిపిస్తున్న హిందూ వ్యవస్థ కుప్పకూలిపోతుందనే అలోచనతో అప్పటి హిందూ చాందస వాదులు ఆ బిల్లు పాస్ కాకుండా చేసారు.ఆ వెంటనే అంబెద్కర్ రాజీనామా చేసారు.

గాంధీ ఆలోచనలు ఇప్పటి సమాజంలోనూ యధేచ్చగా రాజ్యమేలుతున్నాయ్.ఉద్యోగాలు చేసినా, జీతమంతా గుమ్మంలోనే లాక్కునే భర్తలున్నారు,పెళ్ళైపోయి అత్తారింటికెళ్ళాక, పుట్టింటికి చుట్టమే లాంటి స్టేట్మెంట్లు, చెత్తసినిమాల ద్వారా మరియెక్కువగా భారతదేశంలో తిష్టవేసుకుని, ఆమెకు ఒక ఆలంబనంటూ లేకుండా చేస్తున్నాయ్.బాధలు భరించలేక, ఆదరించేదారిలేక, పసిబిడ్డలతో పాటుగా రైలు పట్టాలకో పాడుబడ్డబావులకో, జీవితాన్ని అర్పించే స్త్రీలను రోజుకెంతమందినో చూస్తున్నాం.

హిందూ సమాజం, తాగుబోతు, తిరుగుబోతు భర్తలను సేవించిన స్త్రీలను పతివ్రతలుగా కొనియాడింది.యెంత వెధవ భర్తగా వచ్చినా..వాణ్ణి మార్చుకోవాలనీ, గుళ్ళూ గోపురాలూ తిరిగి, వ్రతాలూ నొములూ చేసి అతణ్ణి దారిలోకి తెచ్చుకోవాలనే చెప్పింది తప్ప, భార్య అనారోగ్యంతో ఉంటే.. భర్తకూడా ఓర్పువహించి ఆమెను బాగుచేసుకోవాలని, యే గ్రంధమూ చెప్పలేదు."మగవాడెన్నైనా చేస్తాడు, యెలాగైనా వుంటాడు, ఇల్లాలిగా ఆమె చక్కబెట్టుకోవాలని" రాసిపారేసి, ఆమెను విపరీతమైన వత్తిళ్ళకు గురిచేసింది.

స్త్రీ స్వేచ్చంటే, షరతులతో కూడింది కాదు,పురుషుడెలా పూర్తి స్వేచ్చతో ఉంటున్నాడో అలాంటి స్వేచ్చకు ఆమెకూడా పూర్తిగా అర్హురాలు, అలాంటి స్వేచ్చను కాంక్షించిన ఒకేఒక భారతీయ మేధావి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్,ఈ విశాల దృక్పధం ఆయనకు విభిన్న సంస్కృతులు పరిశీలించడంవల్ల,  విరామం లేకుండా యెన్నో  గ్రంధాలు చడవడంవల్లా, అసమానతలు లేని సమాజంకోసం కలలుకనడంవల్లా అలవడిందని అంటాన్నేను.ఇంకా హిందూ కోడ్ బిల్లు తదనంతర సంఘటనలు, నిజానిజాలు తెలుసుకోవాలనుకునే వారు యెన్నో వ్యాసాలు వెబ్సైట్స్ లో ఉన్నాయి.చదివితెలుసుకోగలరు.
(written in 2015.)

#Mahatma #Ambedkar
సౌ జ న్య  o - whatup message

చట్టాల పట్ల గౌరవం లేకపోవడానికి కారణం కులవ్యవస్థ



తన కూతుర్ని తక్కువ "కులం" వాడు పెండ్లి చేసుకున్నాడనే కారణంగా కూటికి గతి లేని ఒక కంసాలి అల్లుడిపై కత్తి దుయ్యగా, కోట్లకు పడగెత్తిన కోమటోడు అల్లడిపై కక్ష్య పెంచుకుని తీవ్రవాదులతో చేతులు కలిపి పట్ట పగలు దారుణంగా హతమార్చాడు. నిందితులు కంసాలిని, కోమటోన్ని పోలీసులు అరెస్టు చేసి ఊచలు లెక్కబెట్టిస్తుండగా.., కుల తత్వాన్ని నరనరాన జీర్ణించుకున్న పలువురు కులోన్మాదులు "తండ్రి పేమ" అంటూ రకరకాల వక్ర భాష్యాలను సృష్టించి సభ్య సమాజం తల దించుకునేలా నిసిగ్గుగా వాదిస్తున్నారు. అదీ కూడా చాలదన్నట్లు *"ప్రణయ్" హత్య కేసులో ప్రధాన నిందితుడు, కులోన్మాద హంతకుడు మారుతీరావుకు మద్దతుగా వందలాది మంది కులోన్మాదులు నిసిగ్గుగా బహిరంగ ప్రదర్శనలో పాల్గొనడం, దాన్ని మనువాద మీడియా నైతిక విలువలను పక్కనపెట్టి ప్రచురించడం చూస్తుంటే వీరికి చట్టాలు అంటే ఏమాత్రం గౌరవం లేదని తేలిపోయింది. దీనికి కారణం "కులవ్యవస్థ" అని చెప్పక తప్పదు.

రాజ్యాంగ శాసనాలను, చట్టాలను అతిక్రమించి దుర్వినియోగపర్చడం, వక్రీకరించి నిర్వీర్యం చేయడంలో దోపిడీ కులాల వారిని మించిన వారు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరు ఇంతలా బరితెగించడానికి ఒకే ఒక్క కారణం "కులవ్యవస్థ". కులం పట్ల వారికున్న మమకారం. *రాజ్యాంగానికి పునాది "సమానత్వం". కులవ్యవస్థకు పునాది" అసమానత్వం".* సమానత్వం అనేది ప్రజాస్వామ్య బద్దమైనది కాగా అసమానత్వం అనేది నియంతృత్వ పూరితమైనది. "రాజ్యాంగం" మానవ నిర్మితం కాగా "కులవ్యవస్థ" దేవుడు సృష్టించినట్లు చెప్పబడుతుంది. *రాజ్యాంగాన్ని అనుసరించాలని మానవత్వం ఉన్న మనుషులు చెబుతుండగా.., కులాన్ని పాటించాలని దేవుడిచే రాయబడినవని చెబుతున్న హిందూ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.* వాటిని ఋషులనే మానవాతీత శక్తులు కలిగినట్టి మహా జ్ఞానులు ప్రబోధించారనే నమ్మకం ఉంది. అందువల్లనే "కుల శాసనాన్ని" ధిక్కరించడం పాపమనే నమ్మకం ఉంది.

*రాజ్యాంగ శాసనాలు కుల శాసనాలకు అనుగుణంగా కాక భిన్నంగా వ్యతిరేకంగా ఉండటం వలన రాజ్యాంగ శాసనాల పట్ల గౌరవం ప్రకటించడం లేదు. గౌరవం లేకపోవడం వల్ల శాసనాలను వక్రీకరించడం, నిర్వీర్యం చేయడం, అతిక్రమించడం, దుర్వినియోగం చేయడం లాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.

*జై భీమ్..! ✊🏼 జై భారత్..!!*
*మార్షల్ చిలుక రాందాస్*
 (బహుజనవాది)
సౌ జ న్య  o - whatup message