Pages

*సైన్సు మానవుల హక్కు : వరల్డ్‌ సైన్స్‌ డే*



శాంతిని, అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి ఏడాది నవంబర్‌ 10ని ప్రపంచ సైన్సు దినంగా జరుపుకుంటున్నాం.
దీన్ని యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషన్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) 2001లో ప్రకటించింది.
ఆ మరుసటి ఏడాది 2002 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 'వరల్డ్‌ సైన్స్‌ డే' జరుగుతూ ఉంది.

దీని ముఖ్యోద్దేశం ఏమిటంటే:
 
1.
వైజ్ఞానిక రంగంలో జరుగుతున్న అనేక పరిశోధనల గూర్చి సామాన్యజనానికి తెలియజెప్పడం.

2.
శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి ప్రాచుర్యాన్ని కలిగించడం.

 3.
ఒక రకంగా సైన్సును సమాజానికి దగ్గరగా తీసుకురావడం!

సమాజానికి, శాస్త్ర పరిశోధనలకు మధ్య దూరం ఎక్కువగా ఉన్న సంగతి మనం గ్రహిస్తూనే ఉన్నాం.
శాస్త్రవేత్తలు వారి వారి పరిశోధనా రంగా ల్లో తలమునకలై ఉంటారు.
సామాన్యులు వారి వారి దైనందిన కార్యక్రమాల్లో నిమగమై ఉంటారు.
సైన్సు గురించి, సైన్సు పరిశోధనల గురించి తెలుసుకోవాలనుకునే జనం తక్కువ.

జీవ పరిణామ క్రమంలో మనిషి ఇక్కడి దాకా ఎలా వచ్చాడో తెలుసుకోవడానికి ఒక మంచి ప్రసంగం ఏర్పాటు చేసి, 'అందరూ ఆహ్వానితులే.. ప్రవేశం ఉచితం' అని చెప్పండి. ఏ కొద్దిమందో వస్తారు. దానికి బదులు 'మీ అరికాళ్ళు చూసి, స్వామీజీ మీ భవిష్యత్తు చెప్తారు. ప్రవేశ రుసుము ఐదువందల రూపాయలు' అని బోర్డు పెట్టి చూడండి. విచిత్రంగా జనం విపరీతంగా క్యూ కడతారు. తొక్కిసలాట జరిగి పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చినా రావొచ్చు.

ఇలాంటివి మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.
ఈ పరిస్థితి మారాలి. పరిస్థితి మారాలంటే విద్యావంతుల సంఖ్య పెరగాలి. అంతకన్నా ముఖ్యంగా ప్రజల్లో వివేకం పెరగాలి.

విద్యావంతులు అయినా, కాకపోయినా ఫరవాలేదు.
మంచీ చెడూ విచక్షణతో పాటు, జనంలో విజ్ఞత పెరగాలి. మూఢనమ్మకాలకు దాసోహమనకుండా ప్రశ్నిస్తూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే తెలివిగలవారై ఉండాలి.
సమాజం ఆ స్థాయికి చేరాలీ అంటే... ఇలాంటి సైన్స్‌ డేలు, సైన్సుకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి.

గుడ్డిగా నమ్ముతూ ఉండడం తప్ప, జనంలో ప్రశ్నించే తత్వం కొరవడుతూ ఉంది.

అందుకు మూల కారణం.. చిన్నప్పుడు పాఠశాలల్లో లభించిన విద్యావిధానమే.
ఏ ప్రశ్న అడిగితే ఏ జవాబు రాయాలి అనేది బట్టీయం వేయిస్తారే తప్ప, విద్యార్థులు విషయం అర్థం చేసుకుని ప్రశ్నించడం అనేది వారికి నేర్పుతున్నామా?

 
ప్రశ్నించడం నేర్పించని విద్యావిధానం లోపభూయిష్టమైందే.

పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇవ్వకుండా 'నోరుమూసుకుని చెప్పింది నేర్చుకో' అనే ఉపాధ్యాయులది తప్పుడు బోధనే.

'
చెప్పింది చెయ్యి' అని కోప్పడే తల్లిదండ్రులదీ తప్పుడు పెంపకమే.

ఈ రోజు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇన్ని వైజ్ఞానిక విప్లవాల మధ్య ఆధునికుడు మనగలుగుతున్నాడంటే రాత్రింబవళ్ళు కృషి చేస్తూ, జీవితాలు త్యాగం చేస్తున్నవారు శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు. మరి వీరి గురించి జనానికి తెలియజేయాల్సిన అవసరం లేదా?

ఓ గాయకుడు గొప్పగా పాడతాడు.
ఓ నర్తకి గొప్పగా నర్తిస్తుంది.
ఓ నటుడు అత్యద్భుతంగా భావోద్వేగాలు ప్రదర్శిస్తాడు.
 
ఓ ఆటగాడు మైదానంలో బంతులు అద్భుతంగా విసిరేస్తాడు. జనం వారికి అభిమానులుగా మారి, వారికి భజన చేస్తుంటారు.

నిజమే.
కఠోర సత్యమేమంటే వీరంతా ఎంటర్‌టేయినింగ్‌ రంగానికి సంబంధించినవారు.
సమాజానికి ఆనందాన్ని వినోదాన్ని పంచేవారే గానీ, మనుషుల ఆలోచనా రీతిని,సమాజ గతిని మార్చేవారు కాదు.
నూతన శకంలోకి తీసుకుపోయేవారు కాదు.
ఆ పని నిబద్దతగల, దార్శనికులైన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, రచయితలు, తత్త్వవేత్తలు, క్రాంతికారులైన ప్రజానాయకులు, ఒక ధ్యేయంతో పనిచేసే ఉపాధ్యాయులు, అంకిత భావం గల కార్యకర్తలు మాత్రమే చేయగలరు.
కానీ, సమాజం వారిని పట్టించుకోదు.
 
ప్రభుత్వాలూ పట్టించుకోవు.
నగరాల్లో, మహానగరాల్లో పెద్దపెద్ద పరిశోధనాశాలలుంటాయి. వాటి ముందు నుంచి రోడ్డుమీద వెళ్ళే జనానికి లోపల ఆయా పరిశోధనా శాలల్లో ఏం జరుగుతుందో తెలియదు.
అన్ని రంగాల వారు తిరుగుతుంటారు కానీ, లోపల జరిగే ప్రయోగాల గూర్చి తెలుసుకుందామనుకునే వారు తక్కువ. అందుకే ఇలాంటి 'సైన్స్‌ డే'లు అవసరం అవుతున్నాయి.

వీటివల్ల అప్పుడప్పుడైనా సగటు మనిషికి వైజ్ఞానిక విశేషాల గూర్చి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.

నిత్యజీవితంపై సైన్సు ప్రభావం గురించి, మానవ జీవితంలో దాని అవసరం గురించి జనానికి సరైన అవగాహన రావాలి.

సామాజిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే సైన్సు గురించి సమాజం తప్పని సరిగా తెలుసుకోవాలి. అప్పుడు గాని అశాస్త్రీయ భావాల్ని, విధానాల్ని ఎండగట్టడానికి వీలుకాదు.

అందుకోసమే ప్రపంచ వ్యాప్తంగా ఈ సైన్స్‌డే జరుపుతున్నారు.

పాఠశాల స్థాయి నుంచి పెద్ద పెద్ద ప్రయోగశాలల దాకా సెమినార్లు, కాన్ఫరెన్సులు, ప్రముఖ విజ్ఞానవేత్తల ముఖాముఖి కార్యక్రమాలు, సైన్సు స్పృహగల రచయితల ఉపన్యాసాలు వంటివి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.
అంతే కాదు, ప్రత్యేక ప్రదర్శనలు, ఊరేగింపులు కూడా నిర్వహిస్తూ సామాన్యుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. వారి అవగాహన పెంచుతున్నారు.

జులై 1999లో హంగరీ-బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రతినిధులందరూ చర్చించి వరల్డ్‌ సైన్స్‌డే గాని, వరల్డ్‌ సైన్స్‌ వీక్‌గానీ జరుపుకోవడం తప్పనిసరని నిర్ణయించారు.
ఆ కాన్ఫరెన్స్‌ను యునెస్కో, అంతర్జాతీయ సైన్స్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా పెద్ద ఎత్తున జరిపాయి.
ఆ తర్వాత యునెస్కో ఎగ్జిక్యూటీవ్‌ బోర్డు అక్టోబరు 1999లో పారిస్‌లో సమావేశమై సైన్స్‌డేకి రూపురేఖలు, విధివిధానాలు రూపొందించింది.

ప్రతి సంవత్సరం 28 ఫిబ్రవరిని మన దేశంలో 'నేషనల్‌ సైన్స్‌ డే'గా జరుపుకుంటున్నాం.
ఇది కేవలం మన దేశానికి మాత్రమే సంబంధించింది.
ఆ రోజునే 1930లో మన దేశ శాస్త్రవేత్త సర్‌.సి.వి.రామన్‌కు నోబెల్‌ బహుమతి వచ్చింది.

 
ఇకపోతే నవంబర్‌ 10న జరుపుకునే కార్యక్రమం ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేరోజు జరుపుకునేది.
 
మొదట 2002-2008 మధ్య కాలంలో వరల్డ్‌ సైన్స్‌ డే పేరుతో ఒక ఐదారేండ్లు సైన్సు ఉత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. తర్వాత ఒక్కో సంవత్సరం ఒక్కో అంశానికి ప్రాధాన్యమిస్తూ జరుపుకోవాలని నిర్ణయించారు.

ఇంతవరకు ప్రాధాన్యమిచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.

ఖగోళశాస్త్రం (2009)
సైన్సు కోణంలోంచి సంస్కృతి (2010)
 
హరిత సమాజాలు (20011)
 
ప్రపంచ దేశాల సత్సంబంధాల కోసం సైన్సు (2012)
 
జల పంపిణీ - నిల్వలు - కొత్త విధానాలు (2013),
 
సైన్సు బోధనలో ఉన్నత స్థాయి - ప్రామాణికత (2014)
 
భవిత కోసం సైన్సు (2015)
సైన్స్‌ సెంటర్ల, మ్యూజియంల నిర్వహణ (2016),
సైన్సు - గ్లోబల్‌ అవగాహన (2017)
వంటి అనేక విషయాల మీద దృష్టి కేంద్రీకరించి ప్రపంచ దేశాలన్నీ సైన్స్‌డే - నిర్వహించుకున్నాయి.

మానవ హక్కుల యూనివర్సల్‌ డిక్లరేషన్‌ వెలువడి డైబ్భయి ఏండ్లయిన సందర్భంగా ఈ 2018 సంవత్సరం ''సైన్సు - మానవుల హక్కు'' అనే అంశం ఎంపిక చేశారు.

దాన్నే నినాదంగా తీసుకుని ప్రపంచ దేశాలన్నీ ఏక కంఠంతో నినదించాలని యునెస్కో పిలుపునిచ్చింది.
దేశాలన్నీ ఎక్కడికక్కడ తగిన కార్యక్రమాలు రూపొందించుకుని, నిర్వహించుకోవాలని కోరింది.
 
ఇది కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే కార్యక్రమం కాదు. ప్రయివేటు రంగాల్లోని వ్యవసాయ, వ్యాపార, విద్య, వైద్య, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక సంస్థలన్నీ ఇందులో పాలుపంచుకుంటున్నాయి.

సామాన్య పౌరులు కూడా ఇందులో భాగస్వాములై సమాజంలో సైన్సు ప్రాముఖ్యానికి గుర్తింపు వచ్చేట్టు చేయాలని విశ్వమానవులకు యునెస్కో విజ్ఞప్తి చేసింది.

''
సైన్సు - మానవుల హక్కు'' అనే అంశంతో పాటు భద్రతగల భవిష్యత్తుకు దారులు వేయాలని, సమాజానికి అవసరమైన సైన్సు విధి విధానాలు (పాలసీలు) చట్టాలు రూపొందించుకుంటూ ఉండాలని, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో శరణార్థులయిన సైన్సు పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు భద్రత కల్పించి, వారి పరిశోధనలు కొనసాగేలా వసతులు కల్పించాలని కూడా యునెస్కో ప్రపంచ దేశాలను కోరింది.

మెరుగైన సమాజ నిర్మాణం కోసం సైన్సు ఎంతో అవసరమన్న విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉంది.

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, మనం కూడా ప్రాంతీయ స్థాయిలో పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, పౌరసంఘాల్లో అన్ని చోట్లా వైజ్ఞానిక దృక్పథం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలి. కొత్త ఆలోచనల్ని ప్రచారం చేస్తూ జనం మెదళ్ళలో కొత్త ద్వారాలు తెరవాలి.

ముఖ్యంగా ఈ పని పిల్లల్లో, యువకుల్లో విరివిగా జరగాలి. వారితోనే భవిష్యత్తులో సమాజ స్వరూపం మారుతుంది.

సైన్సు అందిస్తున్న అన్ని సౌకర్యాలను వాడుకుంటూ,
వాటి వెనక గల కృషిని తెలుసుకోకుండా,
 
పురాతన భావజాలానికి ఊడిగం చేసేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. మన దేశంలో ఎక్కువగా ఉన్నారు.
అసలైన ప్రమాదం వీరితోనే గనక,
చాకచక్యంగా వారిని మంచి పద్ధతిలో అదుపులోపెట్టి,
సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉంది.

 
సైన్సు అవగాహన విస్తృత మవుతున్నకొద్దీ మనుషుల మధ్య మాత్రమే కాదు, దేశాల మధ్య, జాతుల మధ్య వైషమ్యాలు, వైరుధ్యాలు తగ్గి, స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి.

ఉదాహరణకు ఇజ్రయిల్‌- పాలస్తీనా సైన్స్‌ ఆర్గనైజేషన్‌ (ఐపీఎస్‌ఓ) అనే సంస్థ ఏర్పడి చురుకుగా పనిచేస్తూ ఉంది.

ఒకవైపు మనిషి స్వార్థ చింతన, మరొక వైపు రాజకీయ దురాగతాలు సమాజాన్ని వెయ్యేండ్లు వెనక్కి నడిపించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో, బాధ్యత గల పౌరులు సైన్సు అవగాహనతో మరింత స్థిరంగా నిలబడి తమ గమ్యాన్ని తాము చేరుకోవాల్సిన అవసరం ఉంది.
 
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించాల్సి ఉంది.
వైజ్ఞానిక స్పృహ గల ప్రజలే స్థిర చిత్తులై నిలబడినప్పుడు, మార్పు తప్పక ప్రజల వల్లే వస్తుంది!!

తల్లితనానికి మన్నన


          ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుల్లో ఒకటి, శబరిమల అయ్యప్ప దేవాలయ వేశానికి స్త్రీలకు అర్హత ఉందని చెప్పడం. 21వ శతాబ్దంలో ఒక గుడిలోకిస్త్రీత్వంకారణంగా ప్రవేశం కల్పించాలని ఈ దేశ ఉన్నత న్యాయస్థానమే ఆదేశించిందంటే మనం మానవ హక్కుల విషయంలో ఎంత దిగజారి ఉన్నామో ఈ విషయం తెలపకనే తెల్పుతుంది. ఆ తీర్పుని ఎందరో స్వాగతిస్తుంటే మరోవైపున కేరళలో కొందరు మహిళలే దాన్ని వ్యతిరేకించడం, ఊరేగింపులు తీయడం కూడా జరిగిపోయింది. మంత్రతంత్రాలున్న విఠలాచార్య సినిమాల్లో చూశాం. నిన్న మొన్న ఇంగ్లీషు చిత్రంమమ్మీలో చూశాం. తమ వాళ్ళను తామే చంపే ఉన్మాదిగా తయారు చేసి వదిలే సంఘటనలు. మమ్మీలో దుష్టశక్తి నోరు తెరవగానే కొన్ని కీటకాలు వస్తాయి. ఆ కీటకాలు కుట్టగానే ఆ కుట్టిన వ్యక్తులు దుష్టశక్తి సైన్యంగా మారిపోతారు. దుష్టశక్తిని చంపడానికి వస్తున్న తమవాళ్ళనే చంపేస్తారు. మంత్రాలకీ, తంత్రాలకీ ఇలాంటి శక్తులు ఉండవు. కానీ, ఒక భావజాలం మాత్రం అలా మంత్రించి వదిలేస్తుంది. అలాంటి సంఘటన నిన్న మొన్నే చూశాం. ఇదే వైదిక భావజాలాన్ని బతికిస్తున్న మనువాదం. రళలోని అయ్యప్ప స్వామి దేవాలయంలోస్త్రీలకు ప్రవేశం కల్పించాలి, ఇది మానవ హక్కుఅని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో మహిళలే ఊరేగింపు చేయడం.మాకు ప్రవేశం వద్దుఅని వారు నినదించడం.దేవాలయంలోకి మేం వెళ్ళంఅంటే వీళ్ళేదో నాస్తికులై హేతువాద చైతన్యంతో చేసిన ఊరేగింపు కాదు. వైదిక భావజాలాన్ని, వంటబట్టించుకున్న వాళ్ళే, మతవాదుల మాయాజాలం లో చిక్కుకున్న వాళ్ళు!

కేరళలో రాజకీయంగా బతకడం కోసం మత వాదం చేసిన ప్రయత్నంలో ఇది ఒక భాగమే కావచ్చు. అయినా, ‘మాకు ఆ హక్కువద్దు అంటూ మహిళలే రావడం ఇది మనువాద మతోన్మాద మంత్ర ప్రభావమే! అంబేడ్కర్ అనే మహాశక్తి లేకపోతేరిజర్వేషన్లు మేం తీసుకోం. అది తప్పుగదా!అని ఈ దేశ దిగువ కులాల వారితో ఎప్పుడోమనమంతా ఒక్కటేఅనే మధుర గీతాలు పాడించేవారే మనువాదులు! సమాజంలో వివక్షలు రేపి, కులభేదాలతో, లింగ అసమాన తలతో భావజాల బానిసలుగా కట్టిపడేయడమే మనువాద నీతి. దీనిలో భాగమేమాకు దేవాలయ ప్రవేశం వద్దుఅని కేరళలో మహిళలే ఊరేగింపు తీయడం.నెలసరిమొదలు కాని ఆడపిల్లలకు, నెలసరి ఆగిపోయిన వయస్సు మళ్ళిన స్త్రీలకు శబరిమల దేవాలయ ప్రవేశం ఉంది కానీ, ‘నెలసరికొనసాగే స్త్రీలకు మాత్రం ప్రవేశం లేకపోవడం నిజంగా విడ్డూరం. నెలసరి అనేది స్త్రీ శరీరతత్వం. నిజానికి నెలసరి అనేది స్త్రీ ఆరోగ్యానికి ఒక సూచిక. స్త్రీ అంటే మాతృత్వం. ఆ ప్రక్రియ తల్లితనానికి తొలి అర్హత. ప్రపంచ మనుగడకు నెలవాలమైన ఈ అర్హతనే కించపరచే విధానం ఎంత నీచమైందో ఆలోచిస్తేనే అర్థమవు తుంది.

జీవ పరిణామం ప్రకారం జీవులు పుట్టి ఈ భూమ్మీద నాలుగు వందల కోట్ల సంవత్సరాలు కావొస్తుంది. ఆ తర్వాత 350 కోట్ల సంవత్సరాలు గడిచాక  (నేటికి 50 కోట్ల సంనాడు) స్త్రీ, పురుష విభజన జరిగింది. స్త్రీ జీవులు గర్భం ధరించి, సంతానాన్ని కనే పరిణామం జరిగి ఏడు కోట్ల సంవత్సరాలు క్రితం మాత్రమే! ఈ కనే జీవుల్లో కూడా రుతుచక్రం (నెలసరి) ప్రారంభమైంది కేవలం కోటి సంవత్సరాల క్రితమే. ఈ పరిణామ క్రమంలో ఉడుత, ఎలుక, ఏనుగు, గుర్రం, పశువులు, చింపాంజీలు, మనుషులు మొదలైన క్షీరదాలన్నింటిలో నెలసరి రుతుక్రమం ఉంది. రుతు క్రమం కనిపించడం జీవి ఆరోగ్యానికి సంకేతం. ఇది జీవ పరిణామక్రమంలో ఉన్నత దశ. సురక్షితమైన జీవచర్య.
ఇలాంటి ఈ జీవచర్యనిఅంటుతో ముడి పెట్టడం ఒక్క భారతీయ సమాజంలోనే చూస్తాం. ముఖ్యంగా వైదిక భావజాలంలో స్త్రీలందరూ శూద్రులు  కిందే లెక్క. శూద్రులకు ఏ విధమైన జ్ఞానార్జన హక్కు లు లేవో ఆ హక్కులు బ్రాహ్మణ  స్త్రీలకూ లేవు. వైదిక సంస్కృతిలో స్త్రీలకు విద్యలు, వేద విద్యలూ నిషేధం. అందుకేతల్లి శూద్రురాలు తానెట్లు బాపడుఅని ప్రశ్నించాడు వేమన.
ఐతే, ఒక నెలలోని మొత్తం రోజుల్లో 24 రోజులు స్త్రీలను శూద్రురాలిగా చూస్తూ, మిగిలిన నాలుగైదు రోజులుఅంటరానిపంచమజాతికి చెందిన వ్యక్తిగా దూరంగా పెట్టడం అనేది కూడా ఈ వైదికంలో కనిపిస్తుంది. ఈ దురాచారం రుతుక్రమం వల్ల వచ్చిన రోగమే! నెలసరి అయిన ఆ నాలుగైదు రోజులు స్త్రీని అంటుకోకూడదు. అంటే స్త్రీలను ఇటు శూద్రులుగా, అటు పంచములుగా రెండు రకాలహోదాలుకల్పించి, వారిని దూరంగా పెట్టిందీ వైదిక సంప్రదా యం. అసలు ఈ అంటు అనే భావజాలం తొలిగా వేదంలోనే పడింది. కృష్ణయజుర్వేదం 2-5-1లో ఇలా ఉంది - త్వష్ణ కుమారుడు విశ్వరూపుడు. విశ్వరూపుడు దేవతల పురోహితుడు. కానీ, యజ్ఞంలో లభించే హవిర్భాగాన్ని దేవతలతో పాటు అసురులకు కూడా చెందేట్టు చూడ్డం వల్ల ఇంద్రునికి ఇతనిపై కోపం వచ్చింది. అతని మూడు తలల్ని నరికేశాడు. దానితో ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం పట్టుకుంది. ఆ పాపభారాన్ని మోయలేక ఇంద్రుడు భూమి దగ్గరకు వచ్చి తన పాప భారాన్ని తీసుకోమని అడుగుతాడు. భూమి ఆ పాపం లో మూడోభాగం తీసుకుంది. ఆ కారణంగా భూమిపై కొంతభాగం ఎడారిగా మారింది. అలాగే చెట్లదగ్గరకు వచ్చి అడిగాడు. కొన్ని చెట్లు మూడోభాగాన్ని తీసుకు న్నాయి. ఆ ఫలితంగా ఆ చెట్ల నుంచి జిగురులు స్రవిస్తున్నాయి. చివరకు ఇంద్రుడు స్త్రీల దగ్గరకు వెళ్ళి తన పాపభారాన్ని పంచుకోండని అర్ధిస్తాడు. అప్పుడు వారు అంగీకరిస్తారు. ఆ పాపభారం వల్లే స్త్రీలకురజస్వలకలుగుతుంది. అది పాపభార ఫలితం కాబట్టి ఆ సమయంలో స్త్రీలను తాకకూడదు. వారితో మాట్లాడకూడదు. కలసి కూర్చోకూడదు. వారు తినే సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే రజ స్వల బ్రహ్మహత్యాఫలం కాబట్టి ఇదే కృష్ణ యజు ర్వేదంలోని అంశం.
 నెలసరికి కారణం ఏమిటో తెలియని కాలంలో అల్లిన ఒక కథే ఆ తర్వాత అదే సామాజిక అంశంగా మారింది. సాంఘిక దురాచా రంగా, లింగవివక్షగా కరుడుకట్టుకు పోయింది. స్త్రీల నెలసరి దోషం అనే విషబీజం ఇక్కడే పడింది. ఆ ఫలితమే స్త్రీలకు అంటుగా, శబరిమలలో అంటరాని తనంగా మారింది. తల్లితనాన్ని కూడా వికృతంగా చూసే మనువ్యవస్థకు మారురూపమే ఈ దేవాలయ ప్రవేశ నిషిద్ధం. మన పురాణ ఇతిహాసాల్లో కూడా దేవుళ్ళకీ, మా తృత్వానికీ పెనవేసుకున్న అనురాగబంధాల్ని చూడలేం. ఒక్క శ్రీకృష్ణుడు తప్ప పాకృతిక నియమాల ప్రకారం తల్లిగర్భాన పుట్టిన దైవాలు కూడా దాదాపుగా లేరు. అందరూ చిత్రవిచిత్రంగా ప్రభవించిన వారే! తల్లి గర్భాన ప్రసవమందినవారు దాదాపుగా లేరు. అందుకే మాతృత్వపు గొప్పదనం అనేది  మన మానవీయ ఆలోచనల్లో తప్ప, మన ఆథ్యాత్మిక అంశాల్లో ఎప్పుడూ లేదు. స్త్రీని గౌరవిస్తే గదా! తల్లిని గౌర వించేది! స్త్రీ గౌరవానికి చోటులేని వైదిక మనుధర్మం లో మాతృత్వ గౌరవానికీ పెద్ద ప్రాముఖ్యత ఏముంటుంది?

శారీరక ధర్మశాస్త్రం ప్రకారం, శరీరం ఒక యంత్రం. నిరంతరం దాన్లో ఎన్నో మలినాలు తయారవుతూ ఉంటాయి. వాటిని నిరంతరం విసర్జిస్తూ ఉండాలి.విసర్జన అపచారంఅని మడిగట్టుకుని బతికే జీవి ఏదీ ఈ భూమ్మీద లేదు. తినడం కంటే విసర్జనే ఆరోగ్యానికి మూలం. వాహనంలో ట్యాంకు నిండా పెట్రోలు నింపినా, మంచి పవర్ గల బ్యాటరీతో స్వి చ్ కొట్టినా, విసర్జన అవయవమైన పొగగొట్టాన్ని మూసి ఉంచితే బండి స్టార్ట్ కాదు.
             మన శరీరం కూడా అంతే... చెమటగా, గుమిలిగా, పుసిగా, పడిశంగా, మూత్రంగా, మలంగా మలి నాలూ ఎప్పుడూ బైటకు పోతూ ఉండాల్సిందే! ఇవి దైహిక కార్యక్రమాలు. వీటికి తోడు స్త్రీలకి సంతానం కనే లక్షణం ఉంది. దానికిఅండంఅవసరం. కాబ ట్టి అండాలు కూడా పుట్టిగిట్టుతూ ఉంటాయి. గిట్టిన అండాలు అక్కడే ఉంటే గర్భాశయం కుళ్ళి తల్లికి అ నారోగ్యం కలుగుతుంది. మనకు పుట్టే యోగం ఉండదు. జాతి నశిస్తుంది. అందుకే ఆ అండాలు బైటకు విసర్జించబడతాయి. ఈ అండ విసర్జననే రజస్వల లేదా నెలసరి అంటాం. ఇది 28 రోజుల చక్రం. మనం పుట్టడం కోసం తల్లి గర్భాలయాన్ని శుద్ధిచేసి, మన కోసం మన జన్మ కోసం సిద్ధంగా ఉంచే అతి పవిత్ర కార్యం ఇది.  ఇక్కడ మనం ఖచ్చితంగా కొన్ని విష యాల్ని చెప్పుకు తీరాలి.

            
ఒకటి: దైవ పూజలు చేసే రోజుల్లో భక్తులు తమ ఇతర విసర్జనల్ని మానుకుంటున్నారా? ఆ విసర్జనలు దైవదర్శనానికో, దైవపూజకో అడ్డంకి కానప్పుడు ఈ మాతృగర్భ అండ విసర్జన ఎలా అడ్డంకి అవుతుంది? ఒక విసర్జన శుద్ధం, ఒక విసర్జన అశుద్ధం ఎలా అవుతుంది? రెండు: వేదం చెప్పింది కాబట్టి వేద వాక్కుగా భావిద్దామా? అంటే... ఈ రోజున వేదంలో చెప్పినట్టు దైవాల్ని పూజించే వాళ్ళు ఒక్కరూ లేరు. వేదకాలంలో వేల సంవత్సరాలు పూజలందుకున్న ఇంద్రుణ్ణి ఇప్పుడు పూజించేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈవేదభూమిలోఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ పెట్టి వెదికినా కన్పించరు. పైగా ఇప్పుడు ఇంద్రుడు పెద్ద వ్యభిచారి. స్త్రీలోలుడుగా మిగిలిపోయాడు. వేదాల్ని, వేద కర్మల్ని పాటించేవారు లేనేలేరు. కాబట్టి ఈనెలసరివిషయాన్ని పాటించాల్సిన పనేలేదు. మూడు: సాధారణంగా నెలసరి రోజుల్లో ఏ స్త్రీ కూడా దైవకార్యాలు చేయదు. కానీ ఇక్కడ శబరిమలలో నెలసరి కనిపించే ఆ మూడు నాలుగు రోజులే కాదు, పరిపూర్ణ మాతృత్వానికి ప్రతీకగా ఉండే నెలసరి చక్రపరి ధిలో ఉన్నన్నాళ్ళు (రజస్వల నుంచి మెనోపాజ్ వర కు) స్త్రీలకి ఆలయ ప్రవేశార్హతలు లేవన్నమాట. అంటే ఈ దైవంమాతృత్వ విరోధి’ (ఈస్ట్రోజన్ హార్మోన్ వైరి) అన్నమాట. మాతృత్వ వైరి మనిషే కాదు. మరి దైవం ఎలా అవుతాడు? ఇది, తల్లితనాన్ని తక్కువ గా, హీనంగా చూడ్డమే. వైదిక సంప్రదాయంలో స్త్రీలకి ఆధ్యాత్మిక హక్కు లేదు. వేదాధ్యయనం, సంస్కారాలు, ఎలానూ లేవు. కనీసం దేవాలయ ప్రవేశం కూడా లేకపోవడం ఎంత దుర్మార్గం. ఇంట్లో భార్య, బిడ్డలు (కూతుళ్ళు) చేసిన వంటలు కూడా అయ్యప్పమాల ధరించిన వారు తినరు. ఇది నిష్టా! మాలాధారణ ఇందుకేనా? సొంత ఇం ట్లోనే అంటరాని తనాన్ని నెలకొల్పే దైవారాధనల్ని ఏమనాలి?

           
స్త్రీలకి ఆధ్యాత్మిక రంగంలో స్థానం కల్పించిన మొదటి వ్యక్తి బుద్ధుడే. వారి కోసం ఒక ప్రత్యేక భిక్షు ణీ సంఘాన్ని ఏర్పాటు చేసిన వారికి ధార్మిక జీవనా న్ని అందించిన మానవీయుడు ఆయనే! మహిళలకు ఆస్తి హక్కు, విద్యా హక్కు, ఉద్యోగపు హక్కు ఎలాగో ఆధ్యాత్మిక హక్కు కూడా అలాంటిదే! దైవాన్ని పూజించడం, పూజించకపోవడం, దర్శించుకోవడం, దర్శించుకోకపోవడం అది ఆస్తిక, నాస్తిక భావజాల అంశం. ఇష్టం వచ్చిన దైవాన్ని పూజించుకోవడం లౌకిక అంశం. కానీ, వివక్షతో దేవాలయ ప్రవేశం లేదని చెప్ప డం అమానవీయం. అనైతికం. ఒకప్పుడు స్త్రీలకు ఆ స్తి హక్కు లేదు. ఓటు హక్కు లేదు. విద్యను పొందే హక్కు లేదు, ఉద్యోగపు హక్కు లేదు ఇవ్వన్నీ హక్కు లే! ఇవేవీ వైదిక మతం ప్రసాదించిన వరాలు కాదు. ఈ ఊరేగింపు తీసినవారు, తీయించినవారు మా మత ధర్మాన్ని మంటగలిపారు. స్త్రీలకి ఎన్నోహక్కులు కల్పించారు. ఇది వైదిక ధర్మ విరుద్ధం. కాబట్టిఆ హక్కులూమాకు వద్దు అని అనిపించగలరా? అరిపించగలరా? ఇలాంటి ఊరేగింపుల్ని చూస్తే  ‘ఎప్పటి నుంచైతే స్త్రీని గౌరవించడం భారతదేశం మానేసిందో, అప్ప టి నుంచే మన పతనం ప్రారంభమయ్యింది. ఎప్పుడై తే అన్నిరంగాల్లో, అన్ని విషయాల్లో స్త్రీలను తీర్చిదిద్ద గలమో అప్పుడే మన అభివృద్ధి మొదలవుతుందిఅని ఎలుగెత్తి చాటిన వివేకానందుడు తల్లడిల్లడా?  మనుషులంతా సమానమే అయినప్పుడు... కుల, మత, జాతి, లింగ వివక్షలు లేని మన సమాజంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించాల్సిందే! ఇది తల్లితనానికి తెచ్చిన గౌరవంగా కీర్తించాల్సిందే!
- బొర్రా గోవర్ధన్,9390600157



అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి.

అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి.
ఈ కాలంలో ప్రేమలు, రహస్య పెళ్లిళ్లు, తర్వాత హత్యాయత్నాలు, హత్యలు, తొందరపాటు వివాహాలు, బాధాకర పర్యవసానాలు చూస్తుంటే కొన్ని జాగ్రత్తలు చెప్పాలనిపిస్తుంది.

ఈ అపరిపక్వ ప్రేమలు,తొందరపాటు పెళ్ళిళ్ళు నిరోధించాలనుకునే
తల్లిదండ్రులు చేయాల్సిన పనులేంటంటే,

మీ అమ్మాయిలకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని చిన్నప్పటినుండే బోధించండి.
స్థిరపడాలనే ఆలోచన కలిగించండి. తర్వాతే పెళ్ళిళ్ళని చెప్పండి.
స్థిరపడకపోతే,తమ కాళ్ళ మీద తాము నిలబడకపోతే కష్టాలు ఎలా ఉంటాయో వివరించి చెప్పండి.
వారిలో ఒక ఆత్మ విశ్వాసాన్ని కలిగించండి.
ఇలా మీరు చిన్నప్పటి నుండి వారిని దగ్గరకు తీసుకొని మాట్లాడడం వల్ల వారిలో విశేషమైన ఆత్మవిశ్వాసం  నెలకొంటుంది.
ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని, ఉన్నతమైన పదవులు అలంకరించాలని, ఉన్నతమై జీవితం జీవించేందుకు ప్రయత్నించాలని నూరి పోస్తే టీనేజ్ వయసులో కలిగే ప్రేమలు దాదాపుగా కలుగవు.

ముఖ్యంగా తల్లిదండ్రులు టీనేజ్లో ఉన్న అమ్మాయి లతో తమ సాన్నిహిత్యాన్ని  పెంచుకోండి. కాలేజీ నుండి రాగానే ఏం పాఠాలు చెప్పారు? ఏ ఫ్రెండ్స్ ను కలిశారు? కాలేజీలో ఏం జరిగింది? ఇవన్నీ ప్రశ్నలు అడిగిన విధంగా కాకుండా మాటల సందర్భంలో అడగడం వల్ల నిజాలు బయటకు వస్తాయి. స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొల్ప బడుతుంది.

అంతే కాకుండా అప్పుడప్పుడూ కాలేజీకి వెళ్లి ఆ అమ్మాయి మిత్రులను‌, లెక్చరర్లను, ప్రిన్సిపాల్ ను కలిసి అమ్మాయి ఎలా చదువుతోంది? ప్రవర్తన ఎలా ఉంది? స్నేహసంబంధాలెలా ఉన్నాయి అని కనుక్కోవడం వల్ల ఒక బాధ్యతాయుత వాతావరణం క్రియేట్ చేసిన వాళ్లమవుతాం.

ప్రేమలు అందుబాటులో ఉన్న వ్యక్తుల మధ్యే కలుగుతుంది. తెలిసీ తెలియని వయసులో వారే సర్వస్వం అని అనుకుంటారు. కనుచూపు   మేర అంటే వీధిలో కావచ్చు, కాలేజీలో కావచ్చు,ఫేస్బుక్ లో కావచ్చు, ఎవరైనా చదువుకున్నవారుగాని చదువుకోనివారుగాని, ఎవరైనా కానీ దగ్గర ఉన్న తోనే  ప్రేమలు కలుగుతాయి.
ఇలాంటి వాతావరణం నిరోధించాలంటే....

చుట్టుపక్కల ఎవరున్నారు?
ఎలాంటి వారు ఉన్నారు? అనేది కూడా గమనించాల్సిన విషయం.
చుట్టుపక్కల ప్రేమ పేరుతో అబ్బాయిలు వెంట పడుతున్నారా? కలుస్తున్నారా? అనే విషయాన్ని మొదట గమనించాలి. అమ్మాయిలకు తెలియకుండానే వారితో అలాంటి అబ్బాయిలతో సాన్నిహిత్యం ఏర్పడని వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఒకవేళ స్నేహం చేసినా అది మంచి స్నేహంగా పరిణమించేందుకు దోహదం చేయాలి.

అమ్మాయి దృష్టి చదువు మీద, ఒక వ్యక్తిత్వ వికాసం మీద ఉండే విధంగా మన మాటలు ఉండాలి. సినిమాల గురించి, ప్రేమల గురించి, పక్కవాళ్ల వైఫల్యాల గురించి మాట్లాడవద్దు.
తల్లిదండ్రులు ఆంతరంగిక విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల్ని దూరంగా ఉంచడం ఎంతో మంచిది.
కొన్ని రహస్య విషయాలు వారి ముందు చర్చించుకోకపోవడం ఎంతో మంచిది.  
కెరీర్ గురించి, అభివృద్ధి గురించి, చదువు, మంచి స్నేహం, సామాజిక ప్రవర్తన, దేశవిదేశాల విషయాలు, స్పోర్ట్స్ విషయాలు..... ఇలాంటి మానసిక అభివృద్ధి కలిగే విషయాలు మాట్లాడితే వాళ్లకు టీనేజీ అపరిపక్వ ఆలోచనలు తగ్గిపోయి, మంచి భవిష్యత్తు పట్ల ఒక లక్ష్యం ఏర్పడి అభివృద్ధి బాట పడతారు.

పిల్లలు చెడిపోవడంలో లేదా తప్పటడుగు వేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది.
వారి బాధ్యతారాహిత్యాన్ని విస్మరించలేం.
పిల్లలు లేచిపోయిన తర్వాత బాధపడేకంటే, మన నియంత్రణలో ఉన్నప్పుడే మంచి వాతావరణం సృష్టించడం మన బాధ్యత.

అమ్మాయి ఉన్న తల్లిదండ్రులు మాత్రమే కాదు...మీ మగపిల్లలు చెడిపోవద్దన్నా ఈ పనులు తప్పక చేయాల్సిందే.

నచ్చితే పాటించండి.....
ఆల్రెడీ పాటిస్తుంటే ఫార్వార్డ్ చేయండి.

భగత్‌ సింగ్‌.. దేశభక్తికి ప్రతిరూపం


ఆ... యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగులేశాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. ఆయనే భగత్‌సింగ్‌. ఆయన జయంతి సెప్టెంబర్‌ 28.

భగత్‌ సింగ్‌.. దేశభక్తికి ప్రతిరూపం
భగత్‌ సింగ్‌...ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌ ...ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి.  భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు. 1907 సెప్టెంబర్‌ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్‌ జిల్లా బంగాలో... ఆ విప్లవ వీరుడికి కిషన్‌ సింగ్‌, విద్యావతి దంపతులు జన్మనిచ్చారు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ  విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు.

యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు  సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది.

12
ఏళ్ల వయసులో బ్రిటీష్ పాలకులపై కసి ఉరకలేస్తున్న  యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్‌ వాలాబాగ్‌ దారుణాలను చూసి భగత్‌సింగ్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్‌ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్‌ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు. 1928లో సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం 1928లో సైమన్‌ కమీషన్‌ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో... లాలాలజపతిరాయ్‌ చనిపోవటం తో భగత్‌సింగ్‌ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్‌ వేశారు. విజిటర్స్‌ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు. 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీత బ్రిటీష్‌ హై కమిషనర్‌ సాండర్స్‌ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్‌సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్‌సింగ్‌ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్‌సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్ధాన్‌ పోలీస్‌ శాఖ లాహోర్‌ న్యాయస్ధానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్‌ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా... తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు. భగత్‌సింగ్‌ను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్ పాలకులు చరిత్ర  వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్‌సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి. త్యాగం, ఆదర్శానికి ఆయన నిదర్శనం. అదే నేటి వెలుగు దారి.